KTR Warangal Tour: కేటీఆర్ వరంగల్ పర్యటన.. క్లారిటీ ఇచ్చిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Warangal Tour: వరంగల్ జిల్లా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్ మేయర్ గుండు సుధారాణి కుడా చైర్మన్ సుందర్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈనెల 5న వరంగల్ లో కేటీఆర్ పర్యటన ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మే 5న సాయంత్రం హెలికాప్టర్ లో కిట్స్ కాలేజీ కి చేరుకుంటారని అన్నారు. పేదల సంక్షేమం కోసం వందలకోట్లు కేటాయించడం జరిగిందన్నారు. 181.45కోట్ల పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారని అన్నారు. కార్మిక ఉద్యోగ మాసోత్సవాల్లో భాగంగా 6960 మందికి లబ్ధి చేకూరడం జరిగిందని అన్నారు. కార్మిక భవనంకు, పూలే భవనానాకి శంకుస్థాపన చేస్తారని అన్నారు. ఆ భవనంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్లమ్ ఏరియాను సందర్శించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. బందం చెరువు అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారని క్లారిటీ ఇచ్చారు.
Read also: Nehru Zoo Park: బాడ్ న్యూస్.. నెహ్రూ జూపార్క్ టికెట్ల ధరలను భారీగా పెంచిన సర్కార్
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారన్నారు. అనంతరం కాజీపేట సెయింట్ గ్రాబియల్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. అకాలవర్షంతో రైతులకు అఫార నష్టం వాటిల్లిందని అన్నారు. రైతుకు ఇబ్బంది కలగకుండా సీఎం కేసిఆర్ చర్యలు చేపట్టారని తెలిపారు. నష్టపోయిన అధైర్యపడవద్దు.. రైతులను ఆదుకుంటామని సీఎం కేసిఆర్ భరోసా ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో చిల్లర పార్టీలు చిల్లర రాజకీయాలతో రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యంతో రైతులు కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎవరో చెప్పే మాటలు విని రైతులు గాయిగత్తర కావద్దని ధీమా వ్యక్తం చేశారు.
Jeans : మా తల్లే.. ఉతికితే చిరిగిపోద్దని 18ఏళ్లు ఒకటే జీన్స్ వేసుకున్నావా
తాజావార్తలు
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కు గుడ్బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!