Etela Security: ఈటలకు భద్రత పెంపు.. వై ప్లస్ కేటగిరికి మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Security: బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎక్స్ కేటగిరీగా ఉన్న ఈటల భద్రతను వై ప్లస్ కేటిరీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత వారం రోజుల నుండి తన భర్తకు ప్రాణహాని ఉందంటూ భార్య జమున ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్కు చెందిన ఒక ఎమ్మెల్సీ తన భర్తను చంపడానికి రూ. 20 కోట్ల సుఫారీ ఇచ్చారని ఆరోపించారు. తన భర్తకు ప్రాణ హాని ఉందని మీడియా ముఖంగా బహిరంగంగా ఆరోపించింది. ఈటల భార్య జమున ఆరోపణల అనంతరం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈటలకు ప్రాణహానీ ఉందంటే తాను నమ్మనని అయినా తెలంగాణలో సుఫారి ఇచ్చి హత్యలు చేయించే సంస్కృతి లేదని చెబుతూనే.. అయినా ఈటలకు అటువంటి ఇబ్బంది ఉందంటే తప్పకుండా ఆయనను రక్షించుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈటల భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కేటీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. అనంతరం పోలీస్ ఉన్నతాధికారి ఒకరు రెండు రోజుల క్రితం ఈటల నివాసంకు వెళ్లి పరిస్థితులను పరిశీలించి వచ్చారు. అనంతరం ప్రభుత్వానికి నివేదకను సమర్పించారు.
Read also: Talakona Falls: వాటర్ ఫాల్స్లో వీడియో కోసం జంప్.. బండరాళ్ల మధ్య చిక్కుకొని నరకయాతన.. చివరకు..!
Also Read
ఈటెల భద్రతను పోలీసులు సమీక్షించి నివేదికను సమర్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈటలకు భద్రత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈటలకు పెంచిన భద్రత నేపథ్యంలో 11 మంది భద్రతా సిబ్బంది ఆయన వెంట ఉంటారు. ఈ ఉత్తర్వులు శనివారం నుండే అమల్లోకి రానున్నట్లు పోలీస్ శాఖ ఉత్తర్వులో స్పష్టం చేసింది. తన భర్తను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ప్రాణానికి హాని ఉందంటూ ఈటల రాజేందర్ భార్య జమున ఆరోపించడంతో భద్రత అంశాన్ని పరిశీలించి భద్రత పెంచుతూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈటల రాజేందర్కు వై ప్లస్ కేటగిరీతో 11 మంది భద్రతా సిబ్బంది ఉండనున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!