Etela Security: ఈటలకు భద్రత పెంపు.. వై ప్లస్ కేటగిరికి మార్పు
Etela Security: బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎక్స్ కేటగిరీగా ఉన్న ఈటల భద్రతను వై ప్లస్ కేటిరీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత వారం రోజుల నుండి తన భర్తకు ప్రాణహాని ఉందంటూ భార్య జమున ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్కు చెందిన ఒక ఎమ్మెల్సీ తన భర్తను చంపడానికి రూ. 20 కోట్ల సుఫారీ ఇచ్చారని ఆరోపించారు. తన భర్తకు ప్రాణ హాని ఉందని మీడియా ముఖంగా బహిరంగంగా ఆరోపించింది. ఈటల భార్య జమున ఆరోపణల అనంతరం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈటలకు ప్రాణహానీ ఉందంటే తాను నమ్మనని అయినా తెలంగాణలో సుఫారి ఇచ్చి హత్యలు చేయించే సంస్కృతి లేదని చెబుతూనే.. అయినా ఈటలకు అటువంటి ఇబ్బంది ఉందంటే తప్పకుండా ఆయనను రక్షించుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈటల భద్రత విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కేటీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. అనంతరం పోలీస్ ఉన్నతాధికారి ఒకరు రెండు రోజుల క్రితం ఈటల నివాసంకు వెళ్లి పరిస్థితులను పరిశీలించి వచ్చారు. అనంతరం ప్రభుత్వానికి నివేదకను సమర్పించారు.
Read also: Talakona Falls: వాటర్ ఫాల్స్లో వీడియో కోసం జంప్.. బండరాళ్ల మధ్య చిక్కుకొని నరకయాతన.. చివరకు..!
Also Read
ఈటెల భద్రతను పోలీసులు సమీక్షించి నివేదికను సమర్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈటలకు భద్రత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈటలకు పెంచిన భద్రత నేపథ్యంలో 11 మంది భద్రతా సిబ్బంది ఆయన వెంట ఉంటారు. ఈ ఉత్తర్వులు శనివారం నుండే అమల్లోకి రానున్నట్లు పోలీస్ శాఖ ఉత్తర్వులో స్పష్టం చేసింది. తన భర్తను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ప్రాణానికి హాని ఉందంటూ ఈటల రాజేందర్ భార్య జమున ఆరోపించడంతో భద్రత అంశాన్ని పరిశీలించి భద్రత పెంచుతూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈటల రాజేందర్కు వై ప్లస్ కేటగిరీతో 11 మంది భద్రతా సిబ్బంది ఉండనున్నారు.
తాజావార్తలు
-
Harish Rao: “వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి”.. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
-
PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
-
AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
-
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో