Hyderabad Weather: గజగజా వణికిపోతున్న రాష్ట్రం.. ఆ జిల్లాలకు హెచ్చరిక..
- రాష్ట్రంలో కొనసాగుతున్న చలిగాలుల తీవ్రత..
- బయటకు వాళ్లేవారే కాదు.. ఇంట్లో ఉన్నవాళ్లు కూడా చలికి వణికిపోతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Weather: రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలకు మొదలైన చలిగాలులు మరుసటి రోజు ఉదయం 10 గంటల తర్వాత కూడా తగ్గడం లేదు. బయటకు వాళ్లేవారే కాదు.. ఇంట్లో ఉన్నవాళ్లు కూడా చలికి వణికిపోతున్నారు. ఉదయం 9 గంటల వరకు చలిగాలులు కొనసాగుతుండటంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు బయటకు రావాలంటే చలికి గజ గజా వణికిపోతున్నారు. సోమవారం పటాన్ చెరువులో 6.4 డిగ్రీలు, రాజేంద్రనగర్లో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. వికారాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల జిల్లాల్లో పొగమంచు కమ్ముకుంది.
Read also: Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నేడు టూరిజం పాలసీపై చర్చ..
Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
ఈ జిల్లాలకు హెచ్చరికలు..
రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు ‘ఆరెంజ్’, మిగిలిన జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ‘ఆరెంజ్’ హెచ్చరికలు, మిగిలిన జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల్లో తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశాలున్నాయని సూచించింది.
Read also: Georgia: జార్జియాలో తీవ్ర విషాదం.. 11 మంది భారతీయులు మృతి..!
ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో ముఖానికి మాస్కులు, స్వెటర్లు లేకుండా ప్రజలు బయటకు రావడం లేదు. చలిగాలులు ఉదయం 9 గంటల వరకు కొనసాగుతాయని, సాయంత్రం 5 గంటల నుంచి చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు. దీంతో నగరంలో ఊటీ తరహా వాతావరణం నెలకొందని గ్రేటర్ చెన్నై వాసులు చెబుతున్నారు. చలిగాలుల తీవ్రత దృష్ట్యా తెల్లవారుజామున నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ బస్టాండ్ల వద్ద తగ్గింది. మార్నింగ్ వాక్ కోసం పార్కులకు వెళ్లేవారు ఆలస్యంగా బయటకు వస్తున్నారు. చాలా ప్రాంతాల్లో, ప్రజలు తమ ఇళ్లను వెచ్చగా ఉంచడానికి గది హీటర్లను ఉపయోగిస్తున్నారు.
IND vs AUS: అవన్నీ నకిలీ వార్తలు.. నాకెలాంటి సంబంధం లేదు: కుంబ్లే
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!