Hyderabad Weather: గజగజా వణికిపోతున్న రాష్ట్రం.. ఆ జిల్లాలకు హెచ్చరిక..
- రాష్ట్రంలో కొనసాగుతున్న చలిగాలుల తీవ్రత..
- బయటకు వాళ్లేవారే కాదు.. ఇంట్లో ఉన్నవాళ్లు కూడా చలికి వణికిపోతున్నారు..
Hyderabad Weather: రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలకు మొదలైన చలిగాలులు మరుసటి రోజు ఉదయం 10 గంటల తర్వాత కూడా తగ్గడం లేదు. బయటకు వాళ్లేవారే కాదు.. ఇంట్లో ఉన్నవాళ్లు కూడా చలికి వణికిపోతున్నారు. ఉదయం 9 గంటల వరకు చలిగాలులు కొనసాగుతుండటంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు బయటకు రావాలంటే చలికి గజ గజా వణికిపోతున్నారు. సోమవారం పటాన్ చెరువులో 6.4 డిగ్రీలు, రాజేంద్రనగర్లో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. వికారాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల జిల్లాల్లో పొగమంచు కమ్ముకుంది.
Read also: Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నేడు టూరిజం పాలసీపై చర్చ..
Also Read
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
- Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..
ఈ జిల్లాలకు హెచ్చరికలు..
రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు ‘ఆరెంజ్’, మిగిలిన జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ‘ఆరెంజ్’ హెచ్చరికలు, మిగిలిన జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల్లో తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశాలున్నాయని సూచించింది.
Read also: Georgia: జార్జియాలో తీవ్ర విషాదం.. 11 మంది భారతీయులు మృతి..!
ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడంతో ముఖానికి మాస్కులు, స్వెటర్లు లేకుండా ప్రజలు బయటకు రావడం లేదు. చలిగాలులు ఉదయం 9 గంటల వరకు కొనసాగుతాయని, సాయంత్రం 5 గంటల నుంచి చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు. దీంతో నగరంలో ఊటీ తరహా వాతావరణం నెలకొందని గ్రేటర్ చెన్నై వాసులు చెబుతున్నారు. చలిగాలుల తీవ్రత దృష్ట్యా తెల్లవారుజామున నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ బస్టాండ్ల వద్ద తగ్గింది. మార్నింగ్ వాక్ కోసం పార్కులకు వెళ్లేవారు ఆలస్యంగా బయటకు వస్తున్నారు. చాలా ప్రాంతాల్లో, ప్రజలు తమ ఇళ్లను వెచ్చగా ఉంచడానికి గది హీటర్లను ఉపయోగిస్తున్నారు.
IND vs AUS: అవన్నీ నకిలీ వార్తలు.. నాకెలాంటి సంబంధం లేదు: కుంబ్లే
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?