KTR: ఆదివారం నాడే పేదల ఇళ్లను రేవంత్ రెడ్డి ఎందుకు కూల్చివేస్తున్నారు..
- ఆదివారం నాడే పేదల ఇళ్లను రేవంత్ రెడ్డి ఎందుకు కూల్చివేస్తున్నారు..
- నిన్న గాజులరామారంలో ఇళ్లు కూల్చారు, రేపు జూబ్లీహిల్స్లోని బోరబండకు వస్తారు..
- కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఇళ్లు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్లే: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ బూత్ స్థాయి సమావేశం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదల ఇళ్లను రేవంత్ రెడ్డి ఆదివారం నాడే ఎందుకు కూల్చివేస్తున్నారు? అని ప్రశ్నించారు. గతంలో హైకోర్టు సెలవు దినాల్లో కూల్చివేతలు చేయవద్దని స్పష్టంగా చెప్పింది.. అయినా గాజులరామారంలో కోర్టు సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు. గాజులరామారంలో ఇళ్లు కూల్చివేశారు, రేపు జూబ్లీహిల్స్లోని బోరబండ బస్తీకి కూడా రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: Chiranjeevi : చిరంజీవి 47 ఏళ్ల సినీ ప్రయాణం.. ప్రాణం ఖరీదు జ్ఞాపకాలను పంచుకున్న మెగాస్టార్
Also Read
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
అయితే, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఇళ్లు కూలగొట్టమని కాంగ్రెస్ బూల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లే అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మన పార్టీ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేశారు.. కాంగ్రెస్ పార్టీ కూలగొట్టిన ఆ ఇంటిని మళ్లీ కట్టించి ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది, రెండు సంవత్సరాల్లో చేసిందేమీ లేదు.. హైడ్రా బూల్డోజర్ పేదల ఇళ్లపైకే వెళ్తుంది, పెద్దల ఇళ్లకు వెళ్లదు అని మండిపడ్డారు. సీఎం సోదరుడితో పాటు మంత్రులు పొంగులేటి, వివేక్ లాంటి వారు ప్రభుత్వ స్థలాల్లో, చెరువుల పైనా ఇళ్లు కట్టినా కూల్చివేయలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తుంది.. 8 ఏళ్లు GST తెచ్చి రక్తం తాగి, ఇప్పుడు కొంత జీఎస్టీ తగ్గించి ఇంటింట పండగ చేసుకోండి అని మోడీ అంటున్నాడు.. GST పేరుతో మా పైసలు మాకు ఇస్తే పండగ చేసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: Telangana Govt: సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా.. ఒక్కో కార్మికుడికి లక్షల్లో బోనస్
ఇక, కేంద్ర ప్రభుత్వం పెట్రోలు ధరలు తగ్గిస్తే పండగ చేసుకుంటామని కేటీఆర్ సూచించారు. ముడి చమురు ధరలు తగ్గుతుంటే , మోడీ చమురు మాత్రం తగ్గడం లేదు.. మతం పేరుతో మంట పెట్టీ చలి కాగేవారు బీజేపీ నాయకులు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కే అవకాశం ఉంది.. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇస్తే తీసుకొని కారు గుర్తుకు ఓటెయ్యాలి అని చెప్పుకొచ్చారు. మోసాన్న మోసంతోనే జయించాలి అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Mukesh Kumar: టీమిండియా పేసర్కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!