Nagarjuna Sagar: నేడు సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల.. సాయంత్రం 4 గంటలకు ముహూర్తం..
- నేడు సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేయనున్నారు..
- సాయంత్రం 4 గంటలకు నీటి విడుదల చేయనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమ కాల్వకు సాగునీటి విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం నుంచి భారీ వరద సాగర్లోకి చేరుతోంది. రైతుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సాగర్ ఎడమ కాల్వకు సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు 4 గంటలకు ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నీటి విడుదలలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి తోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, బి.లక్ష్మారెడ్డి పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు బయలుదేరనున్నారు. ఎగువన కృష్ణానదిలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు నిండిపోయాయి. దిగువన ఉన్న నాగార్జునసాగర్ నిండాలి. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ నుంచి 4.64 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో 10 గేట్లను 18 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు 3,69,866 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా వస్తోంది.
Read also: Committee Kurrollu: మెగా ఫ్యామిలీ నుంచి నిహారికకు సపోర్ట్ అందట్లేదా..? అసలు విషయం అదేనా..?
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
దీంతో గత పదిరోజుల్లో సాగర్ నీటిమట్టం 34 అడుగులు పెరిగి ప్రస్తుతం 537.40 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ఇంకా 53 అడుగుల నీరు పెరగాల్సి ఉంది. 312 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం గురువారం సాయంత్రం 6 గంటలకు 183 టీఎంసీలుగా నమోదైంది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 24 గంటల్లోనే సాగర్లో నీటిమట్టం 11 అడుగులు పెరిగి 22 టీఎంసీల నీరు వచ్చి చేరింది. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే తరహాలో వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో సాగర్ కూడా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. మరోవైపు సాగర్ నుంచి కుడి కాలువకు ఇప్పటికే 4,152 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా శుక్రవారం 2,2592 క్యూసెక్కుల నీటిని ప్రధాన పవర్ హౌస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాగర్ ఎడమ కాల్వకు సాగునీటి విడుదలకు సన్నాహాలు చేశారు.
LB Stadium: నేడు దద్దరిల్లనున్న ఎల్బీ స్టేడియం.. 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం సభ..
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!