Secunderabad Bonalu: రేపే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు..
- రేపే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర..
- జాతర ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు..
- భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం..
- 21- 22 తేదీల్లో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఈ నెల 21న జరగనుంది. బోనాల జాతర ఏర్పాట్లను అధికారులు, ఆలయ సిబ్బంది పూర్తి చేశారు. బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉజ్జయినిలోని మహంకాళి ఆలయానికి 2 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
కర్బలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్ఫేట్ ఓల్డ్ పీఎస్, ప్యారడైజ్, సీటీఓ ప్లాజా, ఎస్బీఐ ఎక్స్రోడ్, వైఎంసీఏ ఎక్స్ రోడ్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్లేన్, బాటా, బైబిల్ హౌస్, మినిస్టర్ రోడ్, రసూల్పురా వైపు వచ్చే వాహనదారులు వెళ్లాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవడానికి. ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులను కూడా పోలీసులు అప్రమత్తం చేశారు. ప్లాట్ఫారమ్ నంబర్ 1కి బదులుగా ప్లాట్ఫారమ్ నంబర్ 10 నుండి స్టేషన్లోకి ప్రవేశించాలని ప్రయాణికులకు సూచించారు.
Also Read
- CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
Read also: Gopanpally Flyover: నేడు గోపల్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభం.. తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..
టొబాకో బజార్ నుంచి మహంకాళి దేవాలయం, జనరల్ బజార్ రోడ్డు నుంచి బాటా ఎక్స్ రోడ్డు నుంచి రాంగోపాల్ పేట పీఎస్, అదయ్య ఎక్స్ రోడ్డును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. కాగా..జాతరకు వచ్చే వారి కోసం అధికారులు పార్కింగ్ స్థలాలను కేటాయించారు. హరిహర కళా భవన్, మహబూబ్ కాలేజ్, ఓల్డ్ జైల్ ఖానా ఓపెన్ ప్లేస్, ఇస్లామియా హై స్కూల్, గవర్నమెంట్ అదయ్య మెమోరియల్ హై స్కూల్, అదయ్య ఎక్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రాబాద్, మహాత్మా గాంధీ విగ్రహం, MG రోడ్, బెల్సన్ తాజ్ హోటల్, అంజలి థియేటర్, పరేడ్ గ్రౌండ్ లో ర్కింగ్ స్థలాలను కేటాయించారు అధికారులు.
Read also: Mallu Bhatti Vikramarka: ఆర్థిక శాఖ సిబ్బందికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విందు..
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు.
* సికింద్రాబాద్ నుంచి ట్యాంక్బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను చిలకలగూడ ఎక్స్ రోడ్డు మీదుగా గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, కవాడిగూడ, మారియట్ హోటల్ మీదుగా మళ్లిస్తారు.
* సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చే ఆర్టీసీ బస్సులను బేగంపేట నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్డు, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు.
* బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ వచ్చే వాహనాలను సజ్జనల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేదా హిల్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా మళ్లిస్తారు.
* ఎస్బీఐ ఎక్స్ రోడ్డు నుంచి ట్యాంక్బండ్ వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ ఎక్స్ రోడ్డు, ప్యారడైజ్, మినిస్టర్ రోడ్ లేదా క్లాక్ టవర్, సంగీత్ ఎక్స్ రోడ్డు, సికింద్రాబాద్ స్టేషన్, చిలకలగూడ, ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు, కవాడిగూడ, మారియట్ హోటల్ మీదుగా మళ్లిస్తారు.
* ప్యారడైజ్ నుండి బైబిల్ హౌస్ వైపు వెళ్లే వాహనాలు ఆర్పి రోడ్, ఎస్బిఐ ఎక్స్ రోడ్ లేదా ప్యారడైజ్ మీదుగా మళ్లించబడతాయి.
* హకీంపేట, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్పేట నుంచి సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చే ఆర్టీసీ బస్సులను క్లాక్ టవర్ వరకు మాత్రమే అనుమతిస్తారు. మళ్లీ ప్యాట్నీ, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు మీదుగా తమ గమ్యస్థానాలకు వెళ్లాలి.
Khalistan: పంజాబ్- హర్యానా హైకోర్టుకు ఖలిస్తాన్ ఉగ్రవాది అమృత్పాల్ సింగ్
తాజావార్తలు
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?