Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Bhatti Vikramarka: శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి కాలరీస్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మారుపేర్ల సమస్యపై కీలక ప్రకటన చేశారు. ఈ సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో పెండింగ్లో ఉన్న మారుపేర్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని భట్టి విక్రమార్క వెల్లడించారు. కమిటీ సమర్పించే సిఫార్సుల ఆధారంగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఈ సమస్య ఇటీవల ఏర్పడింది కాదని, 1997 నుంచే సింగరేణిలో కొనసాగుతున్న పాత సమస్య అని తెలిపారు. అధికారిక రిజిస్టర్లో ఒకరి పేరు ఉండగా, వారి స్థానంలో మరొకరు విధులు నిర్వహించే పరిస్థితులు గతంలో ఉన్నాయని వివరించారు. చట్టప్రకారం ఒకరి పేరుతో మరొకరు ఉద్యోగం చేయడం తీవ్రమైన నేరపూరిత అంశమే అయినప్పటికీ.. కార్మికుల పరిస్థితులను అర్థం చేసుకుని గతంలో సింగరేణి యాజమాన్యం మానవీయ కోణంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిందని భట్టి పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలతో అప్పట్లో 45 మంది అధికారులతో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Also Read
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
ప్రస్తుతం సింగరేణిలో దాదాపు 90 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, మారుపేర్ల సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య కేవలం 128 మంది మాత్రమేనని భట్టి విక్రమార్క చెప్పారు. సంఖ్య పరంగా ఇది పెద్ద సమస్య కాకపోయినా, చట్టపరమైన చిక్కులు ఉండటంతో అధికారులు నిర్ణయం తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ఒకవైపు భవిష్యత్తులో నిబంధనల ప్రకారం చర్యలు ఎదురవుతాయన్న అధికారుల ఆందోళన, మరోవైపు సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిందన్నారు. చాలా ఏళ్లుగా సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఏ ఒక్క అధికారిపైనా భారం పడకుండా కమిటీ ద్వారా సమగ్రంగా పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కమిటీ నివేదిక అందిన వెంటనే 128 మంది మారుపేర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!