Telangana Assembly 2024: నేడు అసెంబ్లీలో మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చ..
- నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగింపు..
- ఇవాళ అసెంబ్లీలో మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చ..
- ధరణి- హైదరాబాద్ అభివృద్ధి- జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly 2024: నేడు తొమ్మిదవ రోజు అసెంబ్లీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాల్టితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ముఖ్యంగా మూడు ప్రభుత్వ బిల్లులపై చర్చించనున్నారు. ధరణి పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారు. అంతేకాకుండా.. త్వరలో ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10.30కు మహీంద్రా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి హాజరవనున్నారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఇటీవల పదోన్నతి పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం..ఎల్బీ స్టేడియంలో భారీ సభలో ప్రసంగించనున్నారు.
Read also: Astrology: ఆగస్టు 02, శుక్రవారం దినఫలాలు
Also Read
ఇవాళ అసెంబ్లీలో ఉద్యోగాల క్యాలెండర్ను ప్రకటిస్తామని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. అలాగే ప్రజలకు తెల్ల రేషన్కార్డులు ఇచ్చే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామన్నారు. పేదలకు రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని తెలిపారు. రేషన్కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. క్రీడాకారులు ఈషాసింగ్, నిఖత్ జరీన్, సిరాజ్లకు ఒక్కొక్కరికి 600 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
కాగా.. హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. అందుకు కీలకమైన చర్యలు తీసుకోనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లతో పాటు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద నాలుగో నగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి జులై 31 అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర విస్తరణపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీలో తీర్మానంపై చర్చ జరగనుంది.
Off The Record : అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది..?
తాజావార్తలు
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!