TG Assembly: అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు.. భూ భారతి, రైతు భరోసా పై చర్చ
- ఇవాళ అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాలు రద్దు..
- మొదట భూ భారతిపై చర్చ - రైతు భరోసా పై స్వల్పకాలిక చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Assembly: ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమావేశాలు రద్దయ్యాయి. “భూ భారతి” బిల్లుపై నేరుగా చర్చ జరుగుతుంది. రైతు భరోసా విధివిధానాలపై కూడా సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. శాసనమండలిలో జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ సవరణ బిల్లును సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసనమండలిలో రైతు భరోసా విధివిధానాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. కాగా.. జీహెచ్ఎంసీ, మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు ఇప్పటికే శాసనసభ ఆమోదం తెలిపింది. హైడ్రామాకు అధికారాలు కల్పిస్తూ తీసుకొచ్చిన జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో విస్తృత చర్చ జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏ మాత్రం ఆలోచించకుండా అనేక కట్టడాలను కూల్చివేసి పేదలు భయపడే పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ సభ్యులు విమర్శించారు. చెరువులు, చెరువుల దగ్గర లక్షలాది పేదల ఇళ్లు ఉన్నాయని అందరికీ భరోసా ఇవ్వాలని కోరారు.
Read also: Dmart Fraud: 100 గ్రాముల ప్యాకెట్ పై 500 గ్రాముల స్టిక్కర్.. డీమార్ట్ పై కేసు నమోదు..
Also Read
- Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. హైదరాబాద్లోని ట్యాంకులు, చెరువులు, కాలువల పరిరక్షణ కోసం ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పేదల ఇళ్లను హైడ్రా కూల్చివేస్తోందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. తాము లేవనెత్తిన అంశాలకు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులతో పాటు జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును విపక్ష సభ్యుల హాజరు లేకుండానే శాసనసభ ఆమోదించింది.
Congress: అంబేడ్కర్పై అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు.. నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపు!
తాజావార్తలు
-
Box Office : సెప్టెంబర్లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!