Dmart Fraud: 100 గ్రాముల ప్యాకెట్ పై 500 గ్రాముల స్టిక్కర్.. డీమార్ట్ పై కేసు నమోదు..
- అంబర్పేట్ గోల్నాకలోని డీ మార్ట్లో ఘరానా మోసం 100 గ్రాముల ప్యాకెట్లపై 500 గ్రాముల స్టిక్కర్ పెట్టి విక్రాయాలు కస్టమర్లు ప్రశ్నిస్తే డీ మార్ట్ ఇన్ఛార్జ్ నిర్లక్ష సమాధానం
Dmart Fraud: దేశంలోనే ప్రసిద్ది చెందిన సూపర్ మార్కెట్లలోనే ఒకటైన డీ మార్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే వేల కొద్దీ వస్తువులు, లెక్కలేనన్ని ఆఫర్లుతో ఎప్పుడూ కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంటాయి. అలాంటి ప్రముఖ స్టోర్లో తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఓ వినియోగదారుడికి విక్రయించిన సరుకుల తూకంలో అవకతవకలు జరిగాయని జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో గోల్నాక డీ-మార్ట్పై కేసు నమోదు చేశారు.
Read also: Camera Found in MRI Centre: ఎంఆర్ఐ సెంటర్ దుస్తులు మార్చుకునే గదిలో కెమెరా
Also Read
- Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
అంబర్పేట్ గోల్నాకలోని అన్నపూర్ణ నగర్కు చెందిన సాయి డీ-మార్ట్ నుండి రూ.8500 సురుకులు కొన్నాడు. ఇంటికి వెళ్లి ప్యాకింగ్ సర్దుకొనే క్రమంలో ఎండు మిర్చి ప్యాకెట్ చెక్ చేశాడు. ప్యాకెట్పై 500 గ్రాములు ధర రూ. 299 కానీ.. ప్యాకెట్లో 100 గ్రాముల ఎండు మిరపకాయలు మాత్రమే ఉంది. సాయి వెంటనే డీ-మార్ట్కు వచ్చి అక్కడి ఇన్ఛార్జ్కి సమాచారం అందించాడు. ఇన్ఛార్జ్ సరైన సమాధానం ఇవ్వకపోగా..ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో సాయి స్థానిక నాయకులకు అక్కడకు పిలిచి జరిగిన విషయం చెప్పడంతో స్థానిక నాయకులు జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు.
Read also: Shutdown Threat: అమెరికాలో ఆర్థిక ప్రతిష్టంభన.. ట్రంప్ ముందు షట్డౌన్ ముప్పు..!
దీంతో జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్సై శ్రీరాం సంజీవరావు, శివ తమ సిబ్బందితో వచ్చి తక్కువ బరువున్న ఎండు మిర్చి ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇతర వస్తువుల తూకాలను అధికారులు తనిఖీ చేశారు. కొన్ని బాదం ప్యాకెట్లలో రంధ్రాలు ఉండడం గమనించారు. వినియోగదారులను మోసం చేయడంతో పాటు, ప్యాకెట్పై అధిక బరువును ముద్రించి, తక్కువ వస్తువును లోపల పెట్టి ఎక్కువ ధర వసూలు చేసినందుకు సెక్షన్ 36(2) కింద కేసు నమోదు చేశారు. అలాగే పంచనామా చేసి సంబంధిత తక్కువ బరువున్న వస్తువులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
Champions Trophy 2025: హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. 2027వరకు తటస్థ వేదికలే!
తాజావార్తలు
-
TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
-
Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..
-
Summer Holidays: విద్యార్థులకు శుభవార్త.. రేపటి నుంచే వేసవి సెలవులు.. ఎప్పటివరకంటే..
-
USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
-
IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!