V. Srinivas Goud: రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది..
- తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నివేదిక తప్పుల తడకగా ఉంది..
- రాష్ట్రంలో 4 కోట్ల మంది బీసీలు.. 3 కోట్ల 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు..
- తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది: శ్రీనివాస్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V. Srinivas Goud: తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రకటించిన నివేదిక తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది అని ఆరోపించారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు.. ఎన్నికల కోసం తప్పుడు నివేదికలను ప్రకటించారు.. దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో తెలియదు.. బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు అన్నారు. మా అంచనా ప్రకారం తెలంగాణ జనాభా 4 కోట్లకు పైగా ఉంటుంది.. అందులో ఓటర్లు 3 కోట్ల 40 లక్షల మందికి పైగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చిల్లర వ్యవహారాలతో ఉద్యమాలు పుట్టుకు వస్తున్నాయని పేర్కొన్నారు. బీసీల జనాభా 60 శాతానికి పైగా ఉండాలన్నారు. మా దగ్గర సర్వే కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు.. అలాగే, 2011 కంటే ఇప్పుడు ముస్లింల జనాభా తగ్గినట్లు చూపించారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Also Read
- CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
- CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
ఇక, బీహార్ లో బీసీల జనాభా 10 శాతం పెరిగినట్లు చెప్పి కులాల వారీగా జాబితా ఇచ్చారు.. కానీ, కాంగ్రెస్ మాత్రం సంవత్సరం పాటు కాలయాపన చేసి ఇప్పుడు హడావుడి చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 4 వేల పేజీల నివేదికను ఎమ్మెల్యేలు ఎప్పుడు ప్రిపేర్ కావాలని ప్రశ్నించారు. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకుంటారు.. బీజేపీతో మాట్లాడి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీ ఎమ్మెల్యేలు ఎన్ని బాధలు పడుతున్నారో చూస్తున్నాం.. తెలంగాణలో కులాల మధ్య కొట్లాటలు పెడుతున్నారు.. మాకు ట్యాబ్ లు ఇస్తే.. మేము సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం.. తెలంగాణలో మరో బీసీ ఉద్యమం వస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!