Rythu Runa Mafi: రెండో విడత రైతు రుణమాఫీ.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
- రెండో విడత రుణమాఫీలో లక్షన్నర రూపాయలు..
- అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
- సుమారు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ..
- మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Runa Mafi: ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణంలో లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. మొదటి విడత ఈ నెల 19న ప్రారంభమైంది. తొలి విడతలో దాదాపు 10.83 లక్షల కుటుంబాలకు చెందిన పదకొండున్నర లక్షల ఖాతాల్లో రూ.6 వేల కోట్లు జమయ్యాయి. ఆధార్ నంబర్, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో దాదాపు 17 వేల మందికి రుణమాఫీ సొమ్ము అందలేదు. మూడో విడతలో ఆగస్టు 15 నాటికి ఒకటిన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రుణమాఫీని మూడు విడతల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే..
Read also: CM Revanth Reddy: లక్షల మంది రైతుల ఇండ్లలో సంతోషం.. ఇది మా ప్రభుత్వ చరిత్ర..
Also Read
- CM Revanth Reddy: డిమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా ‘మహిళా శక్తి’.. 2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
- Telangana Heatwave : తెలంగాణను వణికిస్తున్న భానుడు.. మరో మూడు రోజులు ఇంతే.!
- KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
- Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
మూడు విడతల్లో రూ.31 వేల కోట్ల మాఫీ: లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల లోపు పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ఆదివారం సమావేశంలో తెలిపారు. ఆగస్టులోపు రుణమాఫీ చేస్తామన్న సవాల్ ను హరీశ్ రావు స్వీకరించి మాఫీ చేస్తున్నామన్నారు. తొలి విడతలో రూ.6,093 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. రెండో విడతలో రూ.లక్ష వరకు రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. లక్షన్నర మాఫీ చేస్తామన్నారు. మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, మూడు విడతల్లో రూ.31 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కాగా.. పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే రుణమాఫీ సొమ్మును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు పన్నాగం పన్నుతున్నారు. దీంతో రైతులు తమ ఫోన్లకు వచ్చే మెసేజ్లపై క్లిక్ చేయవద్దని సైబర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే మీ రైతు రుణమాఫీ సొమ్ము దోచుకునే అవకాశం ఉందని, అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వవద్దని హెచ్చరించారు.
Nirmal Crime: రన్నింగ్ బస్సులో మహిళపై అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కి..!
తాజావార్తలు
-
Water Tank Cleaning : వాటర్ ట్యాంక్లో చేపల వాసన వస్తోందా? ఈ ట్రిక్ ట్రై చేయండి.!
-
Peddi : ‘పెద్ది’ ఐటం సాంగ్.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది
-
ASUS VM441 AiO: ఆసుస్ నుంచి కొత్త AI డెస్క్టాప్.. ఆసుస్ VM441 AiO భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Family Planning : ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ఈ టెస్టులు మస్ట్!
-
Vaibhav Vs Jaiswal: వైభవ్ సూర్యవంశీ వల్లే జైస్వాల్ ఫ్లాప్.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?