CM Revanth Reddy: లక్షల మంది రైతుల ఇండ్లలో సంతోషం.. ఇది మా ప్రభుత్వ చరిత్ర..
- లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీ..
- ఇవాల అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
- రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ఇవాల అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేశారు. ఈనేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మా జన్మ ధన్యమైందన్నారు. లక్షలు మంది రైతుల ఇండ్లలో సంతోషంతో మా జన్మ ధన్యమైందని తెలిపారు. రాజకీయ ప్రయోజనం కాదు రైతు ప్రయోజనమే ముఖ్యం అని వచ్చిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. కార్పోరేట్ కంపెనీలు లక్షలాది కోట్లు బ్యాంకులకు ఎగవేస్తున్నారని అన్నారు. బ్యాంకులను మోసం చేయాలని ఉద్దేశంతోటే రుణాలు తీసుకుంటున్నారు, కానీ రైతు తీసుకున్న అప్పు కట్టి తీరతారు అని తెలిపారు. మీరు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నప్పుడు అందరూ అవహేళన చేశారని, గతంలో మాఫీ చేస్తానన్న వాళ్ళు లక్ష రూపాయలకు మిత్తి మిగిలేటట్టు వ్యవహరించారని అన్నారు. 7000 కోట్లు రైతులపై మొండి బకాయిలుగా వదిలేసింది గత ప్రభుత్వమని మండిపడ్డారు. పదేళ్లలో 25 వేల కోట్లు కూడా గత ప్రభుత్వం చెల్లించలేకపోయిందన్నారు. కొందరు మాపై శాపనార్ధాలు పెట్టారని అన్నారు.
Read also: Mallu Bhatti Vikramarka: రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చింది..
Also Read
ఇది మా చిత్తశుద్ధి అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన దక్షతకు ఇది నిదర్శనం అన్నారు. దేశభద్రత ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ అని తెలిపారు. ఆహార భద్రత .. విత్తన సబ్సిడీ ..వ్యవసాయ పనిముట్లకి సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు. రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్.. రైతు బీమా ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. జూలై ఆగస్టు నెలలో చరిత్రలో లిఖించ దగ్గ నెలలు అన్నారు. ఏ రాష్ట్రంలో 31 వేల కోట్ల రుణాలు మాఫీ ఏకకాలంలో చేయలేదన్నారు. ఇది మా ప్రభుత్వ చరిత్ర అని తెలిపారు. ఎన్నికలు లేనప్పుడే మేము రుణమాఫీ చేస్తున్నామన్నారు. కార్పొరేట్ కంపెనీల లాగా బ్యాంకర్లను మేము వన్ టైం సెటిల్మెంట్ అడగలేదన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని ఫుల్ టైం సెటిల్మెంట్ చెల్లిస్తున్నామని తెలిపారు. రైతులు ఆత్మగౌరవంతో ఉండాలని ఆకాంక్ష మాదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Srisailam Dam Gates Lifted: పెరిగిన వరద ఉధృతి.. శ్రీశైలం డ్యామ్ మరో రెండు గేట్లు ఎత్తివేత..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!