CM Revanth Reddy: లక్షల మంది రైతుల ఇండ్లలో సంతోషం.. ఇది మా ప్రభుత్వ చరిత్ర..
- లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీ..
- ఇవాల అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
- రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ఇవాల అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేశారు. ఈనేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మా జన్మ ధన్యమైందన్నారు. లక్షలు మంది రైతుల ఇండ్లలో సంతోషంతో మా జన్మ ధన్యమైందని తెలిపారు. రాజకీయ ప్రయోజనం కాదు రైతు ప్రయోజనమే ముఖ్యం అని వచ్చిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. కార్పోరేట్ కంపెనీలు లక్షలాది కోట్లు బ్యాంకులకు ఎగవేస్తున్నారని అన్నారు. బ్యాంకులను మోసం చేయాలని ఉద్దేశంతోటే రుణాలు తీసుకుంటున్నారు, కానీ రైతు తీసుకున్న అప్పు కట్టి తీరతారు అని తెలిపారు. మీరు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నప్పుడు అందరూ అవహేళన చేశారని, గతంలో మాఫీ చేస్తానన్న వాళ్ళు లక్ష రూపాయలకు మిత్తి మిగిలేటట్టు వ్యవహరించారని అన్నారు. 7000 కోట్లు రైతులపై మొండి బకాయిలుగా వదిలేసింది గత ప్రభుత్వమని మండిపడ్డారు. పదేళ్లలో 25 వేల కోట్లు కూడా గత ప్రభుత్వం చెల్లించలేకపోయిందన్నారు. కొందరు మాపై శాపనార్ధాలు పెట్టారని అన్నారు.
Read also: Mallu Bhatti Vikramarka: రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చింది..
Also Read
ఇది మా చిత్తశుద్ధి అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన దక్షతకు ఇది నిదర్శనం అన్నారు. దేశభద్రత ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ అని తెలిపారు. ఆహార భద్రత .. విత్తన సబ్సిడీ ..వ్యవసాయ పనిముట్లకి సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు. రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్.. రైతు బీమా ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. జూలై ఆగస్టు నెలలో చరిత్రలో లిఖించ దగ్గ నెలలు అన్నారు. ఏ రాష్ట్రంలో 31 వేల కోట్ల రుణాలు మాఫీ ఏకకాలంలో చేయలేదన్నారు. ఇది మా ప్రభుత్వ చరిత్ర అని తెలిపారు. ఎన్నికలు లేనప్పుడే మేము రుణమాఫీ చేస్తున్నామన్నారు. కార్పొరేట్ కంపెనీల లాగా బ్యాంకర్లను మేము వన్ టైం సెటిల్మెంట్ అడగలేదన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదని ఫుల్ టైం సెటిల్మెంట్ చెల్లిస్తున్నామని తెలిపారు. రైతులు ఆత్మగౌరవంతో ఉండాలని ఆకాంక్ష మాదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Srisailam Dam Gates Lifted: పెరిగిన వరద ఉధృతి.. శ్రీశైలం డ్యామ్ మరో రెండు గేట్లు ఎత్తివేత..
తాజావార్తలు
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?