Telangana Cabinet: బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణపై సర్కర్ ఫోకస్.. నేడు కేబినెట్, అసెంబ్లీలో చర్చ
- తెలంగాణలో తేలిన బీసీల లెక్క ..
- ఎస్సీ వర్గీకరణపైనా ముగిసిన కసరత్తు..
- సర్కారు దగ్గరున్న నివేదికలు..
- ఇవాళ కేబినెట్ ముందుకు రెండు రిపోర్టులు..
- కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీలో చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet: ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు విషయంలో తెలంగాణ ప్రభుత్వం జెట్ స్పీడుతో ముందుకుపోతోంది. రాష్ట్రంలో ఏ సామాజికవర్గం లెక్క ఎంత అనేది ప్రభుత్వం దగ్గర ఉంది. రాష్ట్రంలో 3 కోట్ల 54 లక్షల మంది ఇచ్చిన వివరాలు సర్కారు దగ్గరున్నాయి. మొత్తంగా కోటీ 12లక్షల 15వే కుటుంబాల వివరాలు నమోదు చేశారు. కులగణనలో 96 శాతానికి పైగా జనాభా పాల్గొంది. సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతమని లెక్క తేలింది. ముస్లిం మైనారిటీల్లో బీసీ జనాభా 10.08 శాతంగా ఉంది. ముస్లిం మైనారిటీల్లో బీసీలు కలిపి మొత్తం బీసీల జనాభా 56.33 శాతంగా తేలింది. రాష్ట్రంలో ఓసీ జనాభా 15.79 శాతం ఉంటే.. ముస్లిం మైనారిటీల్లో ఓసీ జనాభా 2.48 శాతం ఉంది. రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీ జనాభా 12.56 శాతమని సర్వే లెక్క తేల్చింది. ఇక ఎస్సీ జనాభా 17.43 శాతం ఉండగా.. ఎస్టీ జనాభా 10.45 శాతం ఉంది.
Read Also: CM Chandrababu: ఇంఛార్జ్ మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు.. ఆ బాధ్యత మీదే..!
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
మరోవైపు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కోసం కసరత్తు పూర్తయింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులతో పాటు, ఏకసభ్య జ్యూడిషియల్ కమిషన్ సిఫారసులు ప్రభుత్వానికి అందాయి. బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణ నివేదికలను కేబినెట్ మీటింగ్లో ప్రవేశపెడతారు. ఇవాళ శాసనసభ ప్రత్యేక సమావేశంలో చర్చిస్తారు. ఉభయ సభల్లో ఈ రెండింటిపై డిస్కస్ చేస్తారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలంటూ ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణే అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటను కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈసారైనా మాజీ సీఎం కేసీఆర్ సభకు రావాలని కాంగ్రెస్ పిలుస్తోంది! గులాబీ బాస్ వస్తారా? రారా అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: Ratha Saptami in Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు.. ప్రత్యేక, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బీసీలకు చాలా ఏండ్ల తర్వాత మేలు జరగబోతోందని సర్కారు చెబుతోంది. అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని మంత్రి పొన్నం హెచ్చరించారు. కులగణన కోసం ఇన్నాళ్లు ఉద్యమం చేసిన పోరాట యోధులకు అభినందనలు తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీ నేతలు సర్వేలో పాల్గొనలేదని పొన్నం విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్క కవిత తప్పించి ఎవరూ సర్వేకు వివరాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. సర్వేలో ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే తమ దృష్టికి తీసుకురావొచ్చని, సరి చేస్తామని మంత్రులు క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!