Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
- షాబాద్ మండలంలో జరిగిన ఆరు హత్యల కేసు
- రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు
- నిందితుడి కోసం ప్రస్తుతం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఆరు హత్యల కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన ప్రాథమిక వివరాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఘటన రాత్రి సుమారు 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట మధ్య జరిగినట్లు భావిస్తున్నారు. నిందితుడి కోసం ప్రస్తుతం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.
ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి
దర్యాప్తు అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడు రాజ్ కుమార్ ముందుగా ప్రియురాలైన మైనర్ బాలిక ఇంటికి వచ్చి 11 గంటల ప్రాంతంలో మైనర్ బాలికను కారులో బలవంతంగా తీసుకొని వెళ్లాడు. బయటికి వెళ్ళి వద్దామని చెప్పి మైనర్ బాలికను మభ్యపెట్టి కారులో ఎక్కించుకొని వెళ్లాడు. మైనర్ బాలిక అమ్మమ్మ నాయనమ్మ ఇద్దరు వారించినప్పటికీ ఇప్పుడే వస్తామంటూ బాలికను బయటికి తీసుకెళ్లాడు నిందితుడు.
Also Read
- Tragedy: వీడు మనిషి కాదు మానవ మృగం.. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో.. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురి హత్య..
- MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
- Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
- Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుండి మరో నోటిఫికేషన్
మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు బాలికను తీసుకెళ్లి రాజకుమార్.. బాలికపై అఘాయిత్యం చేసి గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అదే కారులో బాలిక ఇంటికి వచ్చిన రాజకుమార్.. ఇంట్లో ఉన్న అమ్మమ్మ నాయనమ్మ రుక్మిణి, లక్ష్మీ లను అతికిరాతికంగా చంపేశాడు. అక్కడినుంచి నేరుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్ళాడు నిందితుడు రాజకుమార్. తన పిల్లల్ని చూడాలని ఉందని భార్యకు ఫోన్ చేశాడు. పిల్లల కోసం వచ్చానని చెప్పడంతో రాజ్ కుమార్ ని ఇంట్లోకి రానిచ్చింది భార్య.
అనంతరం తన ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లల హత్య
ఇంట్లోకి వెళుతూనే భార్యపై కత్తితో దాడి చేశాడు రాజకుమార్.. వెంటనే అప్రమత్తమైన భార్య రాజ్ కుమార్ నుంచి తప్పించుకునేందుకు బయట వరకు పరుగులు పెట్టింది. అయినా వదలకుండా భార్యను ఇంట్లోకి తీసుకువచ్చి కిరాతకంగా చంపేశాడు. భార్యను చంపేసిన తర్వాత ఇద్దరు పిల్లల్ని కిరాతకంగా గొంతు కోసి చంపాడు రాజ్ కుమార్.. ఆరుగురిని చంపిన తర్వాత కారులోనే పారిపోయాడు.
ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు
కారులో పారిపోతూ తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడాడు. భార్యా పిల్లలతో పాటు తన ప్రియురాలని వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మని చంపేసిన అని తండ్రికి రాజ్ కుమార్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని తండ్రికి చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రాజకుమార్ పారిపోయాడు. రాజకుమార్ కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
-
Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!