New Ration Cards: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. అర్హులకు రేషన్, ఆరోగ్య కార్డులు..
- కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త..
- ప్రజాపరిపాలన కార్యక్రమంలో రేషన్కార్డు- హెల్త్కార్డు వివరాల సేకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. సెప్టెంబరు 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపరిపాలన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. సెప్టెంబరులో 10 రోజుల పాటు ప్రజాపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేషన్కార్డు, హెల్త్కార్డు వివరాల సేకరణ జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పౌరునికి పూర్తి ఆరోగ్య ప్రొఫైల్తో హెల్త్కార్డులు ఇవ్వబోతున్నామని వివరించారు. కాగా, రేషన్కార్డులు, ఆర్యోగశ్రీ కార్డులను వేర్వేరుగా అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. రేషన్ కార్డులకు అర్హులైన వారిని గుర్తించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సబ్ కమిటీని కూడా మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి రేషన్కార్డులకు సంబంధించిన హెల్త్కార్డులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read also: Srisailam Dam: శ్రీశైలం డ్యామ్కు భారీ వరద.. కాసేపట్లో గేట్లు ఎత్తనున్న అధికారులు..
Also Read
- Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
- Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే.. తెలంగాణలో 9 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు కావడం లేదు.. ఈ క్రమంలో.. చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, కుటుంబాలు పెంచుకుంటున్నారు, పిల్లల సంఖ్య పెరుగుతోంది.. మార్పులు కొత్త రేషన్కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం చేస్తోంది. ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది… కాగా.. గతేడాది డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన ఐదు హామీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఐదు హామీలకు సంబంధించి మొత్తం 1కోటి 9 లక్షల 12 వందల 55 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల డేటా ఎంట్రీ జనవరి 12తో పూర్తయింది.ఈ క్రమంలో మరోసారి ప్రజాపరిపాలన కార్యక్రమంలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల దరఖాస్తులను స్వీకరించేందుకు రేవంత్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.
OYO : ఓయో రూముల్లో సీక్రెట్ కెమెరాలు.. జంటల రొమాంటిక్ సీన్స్ రికార్డ్.. ఆపై బ్లాయ్ మెయిల్
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్లో జాబ్స్కి నోటిఫికేషన్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!