Kukatpally Sahasra Case: క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి సహస్రను చంపేశాడు.. సైబరాబాద్ సీపీ వెల్లడి
- క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి సహస్రను చంపేశాడు
- బెెదిరించడానికే కత్తి తీసుకెెళ్లాడు
- సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం వచ్చి సహస్రను చంపేసినట్లుగా పోలీసులు తెలిపారు. కూకట్పల్లి సహస్ర హత్య కేసు వివరాలను శనివారం సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. సహస్ర ఇల్లు-నిందితుడి ఇల్లు పక్కపక్కనే ఉండడంతో క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకున్నాడని చెప్పారు. సహస్ర తమ్ముడి బ్యాట్ నచ్చడంతో ఎలాగైనా దొంగిలించాలని ప్రణాళిక రచించుకున్నాడని పేర్కొన్నారు. దీని కోసం నెల రోజుల క్రితమే పేపర్పై స్కెచ్ గీసుకున్నట్లు తెలిపారు.
ఈనెల 18న తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే నిందితుడు సహస్ర ఇంటికి వచ్చాడని.. ఆ సమయంలో సహస్ర టీవీ చూస్తోందన్నారు. కిచెన్లో ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకెళ్తుండగా అలికిడికి సహస్ర అరిచించిందని.. దీంతో నిందితుడు పారిపోతుండగా సహస్ర చొక్కా పట్టుకుందని.. వెంటనే బెడ్రూమ్లోకి తోసేసి కత్తితో పొడిచేశాడన్నారు. ఈ సమయంలో నిందితుడి ఇంట్లో తండ్రి, సోదరీమణులు ఉన్నారని.. చాటుగా వెళ్లి బాత్రూమ్లో స్నానం చేసి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసినట్లు తెలిపారు.
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
ఎవరైనా కనిపిస్తే బెదిరించడానికే నిందితుడు కత్తి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు. అదేరోజు తల్లి అడిగితే తనకేమీ తెలియదని చెప్పాడని.. రెండోరోజు అడిగింది.. మూడోరోజు అడిగితే నువ్వే నన్ను పట్టించేటట్లు ఉన్నావని నిందితుడు ఆవేశపడ్డాడని తెలిపారు. హత్య చేసిన తర్వాత కత్తి బయట కడిగేసి.. టీ షర్ట్ కప్పుకుని లోపలికి వెళ్లాడని.. అనంతరం బాత్రూమ్లో స్నానం చేసి ఆ బట్టలు వాషింగ్ మిషన్లో వేశాడని వివరించారు. అయితే రెండు నెలల క్రితం మొబైల్ వచ్చిందని.. అదెక్కడిది అని అడిగితే సమాధానం చెప్పలేదని తల్లి తమతో చెప్పిందని పేర్కొన్నారు.
నిందితుడు సరిగ్గా స్కూల్కు వెళ్లడని.. ఇంట్లో ఎప్పుడూ ఓటీటీలో క్రైమ్ సినిమాలు చూస్తూ ఉంటాడని పేర్కొన్నారు. ఇక ఈనెల 18న ఉదయం 11:30కి కుందేల్ కూడా చనిపోయిందని… ఆ స్టోరీ కూడా నిందితుడు వివరించాడన్నారు. సహస్ర ఇంటికి నిందితుడు పలుమార్లు వెళ్లాడని.. డోర్ లాక్ చేయరన్న విషయం తెలిసే ఈరోజు దొంగతనాకి వెళ్లాడని తెలిపారు. ఇంట్లో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండడంతోనే నిందితుడు బ్యాట్ దొంగతానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!