Kukatpally Sahasra Case: క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి సహస్రను చంపేశాడు.. సైబరాబాద్ సీపీ వెల్లడి
- క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి సహస్రను చంపేశాడు
- బెెదిరించడానికే కత్తి తీసుకెెళ్లాడు
- సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ బ్యాట్ దొంగతనం కోసం వచ్చి సహస్రను చంపేసినట్లుగా పోలీసులు తెలిపారు. కూకట్పల్లి సహస్ర హత్య కేసు వివరాలను శనివారం సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. సహస్ర ఇల్లు-నిందితుడి ఇల్లు పక్కపక్కనే ఉండడంతో క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకున్నాడని చెప్పారు. సహస్ర తమ్ముడి బ్యాట్ నచ్చడంతో ఎలాగైనా దొంగిలించాలని ప్రణాళిక రచించుకున్నాడని పేర్కొన్నారు. దీని కోసం నెల రోజుల క్రితమే పేపర్పై స్కెచ్ గీసుకున్నట్లు తెలిపారు.
ఈనెల 18న తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే నిందితుడు సహస్ర ఇంటికి వచ్చాడని.. ఆ సమయంలో సహస్ర టీవీ చూస్తోందన్నారు. కిచెన్లో ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకెళ్తుండగా అలికిడికి సహస్ర అరిచించిందని.. దీంతో నిందితుడు పారిపోతుండగా సహస్ర చొక్కా పట్టుకుందని.. వెంటనే బెడ్రూమ్లోకి తోసేసి కత్తితో పొడిచేశాడన్నారు. ఈ సమయంలో నిందితుడి ఇంట్లో తండ్రి, సోదరీమణులు ఉన్నారని.. చాటుగా వెళ్లి బాత్రూమ్లో స్నానం చేసి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసినట్లు తెలిపారు.
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
ఎవరైనా కనిపిస్తే బెదిరించడానికే నిందితుడు కత్తి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు. అదేరోజు తల్లి అడిగితే తనకేమీ తెలియదని చెప్పాడని.. రెండోరోజు అడిగింది.. మూడోరోజు అడిగితే నువ్వే నన్ను పట్టించేటట్లు ఉన్నావని నిందితుడు ఆవేశపడ్డాడని తెలిపారు. హత్య చేసిన తర్వాత కత్తి బయట కడిగేసి.. టీ షర్ట్ కప్పుకుని లోపలికి వెళ్లాడని.. అనంతరం బాత్రూమ్లో స్నానం చేసి ఆ బట్టలు వాషింగ్ మిషన్లో వేశాడని వివరించారు. అయితే రెండు నెలల క్రితం మొబైల్ వచ్చిందని.. అదెక్కడిది అని అడిగితే సమాధానం చెప్పలేదని తల్లి తమతో చెప్పిందని పేర్కొన్నారు.
నిందితుడు సరిగ్గా స్కూల్కు వెళ్లడని.. ఇంట్లో ఎప్పుడూ ఓటీటీలో క్రైమ్ సినిమాలు చూస్తూ ఉంటాడని పేర్కొన్నారు. ఇక ఈనెల 18న ఉదయం 11:30కి కుందేల్ కూడా చనిపోయిందని… ఆ స్టోరీ కూడా నిందితుడు వివరించాడన్నారు. సహస్ర ఇంటికి నిందితుడు పలుమార్లు వెళ్లాడని.. డోర్ లాక్ చేయరన్న విషయం తెలిసే ఈరోజు దొంగతనాకి వెళ్లాడని తెలిపారు. ఇంట్లో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండడంతోనే నిందితుడు బ్యాట్ దొంగతానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
-
N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
-
IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్బస్టర్’ ఈజ్ స్మాల్ వర్డ్
ట్రెండింగ్
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!