Telangana Narcotics Police: బంపర్ ఆఫర్.. గంజాయి సమాచారం ఇవ్వండి రూ.2 లక్షలు పొందండి..
- సామాన్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు..
- గంజాయిపై సమాచారం ఇచ్చిన వారికి భారీ రివార్డు..
- ఏకంగా 2 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటన..
- ఫిర్యాదు చేసేందుకు 8712671111కు సమాచారం ఇవ్వండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Narcotics Police: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ డ్రగ్స్, మద్యం తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసులు కూడా డ్రగ్స్పై చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈనేపథ్యంలో.. తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు తాజాగా సామాన్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గంజాయిపై సమాచారం ఇచ్చిన వారికి భారీ రివార్డు ప్రకటించారు. ఏకంగా 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అయితే, 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ గురించి సమాచారం ఇస్తే మాత్రమే ఈ మొత్తాన్ని బహుమతిగా గెలుచుకునే అవకాశం ఉంది. డ్రగ్స్, గంజాయిపై ఫిర్యాదు చేసేందుకు 8712671111కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
Read also: CM Stalin: కచ్చతీవును ఇంకెప్పుడు స్వాధీనం చేసుకుంటారు.. ప్రధానిపై స్టాలిన్ ఫైర్..!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 1,892 డ్రగ్స్ కేసులు నమోదైనట్లు నార్కోటిక్ పోలీసులు తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రూ.179.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ పోలీసులు తెలిపారు. జనవరి నుంచి జూన్ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా 679 గంజాయి కేసులు నమోదు కాగా, 120.41 కోట్ల రూపాయల విలువైన 42,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో డ్రగ్స్ కేసులతో పాటు సైబర్ క్రైమ్ కేసులు కూడా భారీగా పెరిగాయని.. అధికారులు తెలిపారు. ఈ ఏడాది గడిచిన 6 నెలల్లో దాదాపు 2.52 లక్షల సైబర్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆరు నెలల్లో మోసగాళ్ల నుంచి దాదాపు 262 కోట్ల రూపాయల నగదు బయటపడిందని, 5,191 మంది బాధితులకు తిరిగి చెల్లించామని ఆయన చెప్పారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
CM Revanth Reddy: నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఎవరికి?
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!