Begum Bazar Land: బేగంబజార్లో భూమి ధర ముంబయితో పోటీ.. గజానికి రూ.10 లక్షలు..!
- హైదరాబాద్ బేగంబజార్ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద హోల్సేల్ మార్కెట్..
- బేగంబజార్లో గజం స్థలం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Begum Bazar Land: హైదరాబాద్ బేగంబజార్ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద హోల్సేల్ మార్కెట్. హైదరాబాద్లోని ప్రసిద్ది చెందిన బేగంబజార్లో భూములు, భవనాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. గతంలో గజం భూమి ధర రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు మాత్రమే ఉండగా ఇప్పుడు బేగంబజార్ లో భూముల ధర ముంబైతో పోటీ పడుతోంది. ముంబైలో మాదిరిగా ఇక్కడ కూడా గజం స్థలం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంది. వీధిని బట్టి గజం ధర కనీసం రూ.20 లక్షలు మరియు ప్రైమ్ ఏరియాల్లో రూ.25 లక్షల వరకు ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.10 నుంచి రూ.20 లక్షలకు పెరిగింది. ఇప్పుడు కూడా చదరపు అడుగు ధర రూ.70 నుంచి రూ.80 వేలు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కూడా చదరపు అడుగు ధర రూ.20 వేలకు మించడం లేదు. అయితే ఇక్కడ ఒక్కసారిగా ధరలు పెరగడం విశేషం.
Read also: CM Revanth Reddy: ఈరోజు తప్పితే దసరా వరకు కుదరదట.. భూమి పూజపై రేవంత్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
భవిష్యత్తులో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. బేగంబజార్లో ఖాళీ లేదు. పాత, శిథిలావస్థలో ఉన్న భవనాలు వాటి యజమానులకు బంగారంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పాత భవనాలను కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించినా ఇప్పుడు పాత భవనాలకు గిరాకీ పెరిగింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దృష్టి బేగంబజార్ వైపు మళ్లింది. పాత భవనాల విక్రయాలపై నిత్యం ఆరా తీస్తున్నారు. అందరికంటే ఎక్కువ ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఒకరిపై ఒకరు రేటు పెంచడంతో వ్యాపారుల మధ్య పోటీ వేలంపాటను తలపిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. భూమి అందుబాటులో లేకపోవడంతో పాత భవనాలు కొత్త నిర్మాణాలకు పునాది వేస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర నుండి చాలా మంది టోకు వ్యాపారులు ఇక్కడ స్థిరపడ్డారు. చదరపు అడుగుకు విక్రయించే మడిగ దుకాణాల ధరలు కూడా రూ. కోట్లలో పలుకుతున్నాయి.
Constables Suspended: లంచాలు, యువతులతో ఖాకీల రాసలీలు.. సస్పెండ్ చేసిన హైదరాబాద్ సీపీ
తాజావార్తలు
-
Pakistan: జపాన్లో మసీదు వివాదం.. పాకిస్తాన్ పరువు పోయిందిగా..
-
YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
-
Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
-
Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!