CM Revanth Reddy: ఈరోజు తప్పితే దసరా వరకు కుదరదట.. భూమి పూజపై రేవంత్ కీలక వ్యాఖ్యలు..
- పది సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి తెలంగాణ తల్లి విగ్రహం..
- ఈరోజు తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని పండితులు..
- వేద పండితుల సలహా మేరకు ఈరోజు ప్రారంభించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఈరోజు తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని, పండితులు తెలిపారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసుకోవడం మంచి పరిణామం అన్నారు. పది సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి తెలంగాణ తల్లి విగ్రహం గురైందన్నారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని భావించామన్నారు. వేద పండితుల సలహా మేరకు ఈరోజు ప్రారంభించామన్నారు. ఈరోజు తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని పండితులు తెలిపారు. సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కనిదంటూ ఏది లేదని.. తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారన్నారు. సోనియాగాంధీ మాట శిలా శాసనం అని తెలిపారు. 2014 ,24 వరకు ఎన్నోన్నో నిర్మించామని చెప్పారన్నారు. పది సంవత్సరాలు పరిపాలన చేసిన వారు తెలంగాణ తల్లిని మరుగున పడేశారన్నారు. అన్నీ నేనే అని చెప్పారన్నారు. ప్రగతి భవన్ పేరుతో గడిని నిర్మించుకుని.. పోలీసులను పహారగా పెట్టారన్నారు. తెలంగాణ ప్రజలను ప్రగతి భవన్ లోకి రాకుండా దూరం పెట్టారని తెలిపారు.
Read also: Constables Suspended: లంచాలు, యువతులతో ఖాకీల రాసలీలు.. సస్పెండ్ చేసిన హైదరాబాద్ సీపీ
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
ప్రభుత్వ పాలనకు గుండెకాయ సచివాలయం అన్నారు. నాటి మంత్రులు ప్రజలకు అందుబాటులో లేరన్నారు. ఇరవై రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కానీ తెలంగాణ తల్లి విగ్రహం కోసం మహా అయితే కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి మనుసు రాలేదు నాటి ప్రభుత్వానికన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం లేక పోవడం లోటుగా భావించమన్నారు. మేధావుల సూచనల మేరకు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టామని తెలిపారు. కొందరు తమ కోసం సెక్రటేరియట్ ముందు స్థలం ఏర్పాటు పెట్టుకున్నారన్నారు. జూన్ 2న చెప్పిన.. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పామని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎమ్ కోరుకుంటూ నారో జేఎన్టియు ఫైన్ ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ కు తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించే భాద్యత ఇచ్చామన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైన రోజు డిసెంబర్ 9, సోనియాగాంధీ జన్మదినోత్సవమని.. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండుగ రోజన్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, ఈ అవకాశం నాకు రావడం నా అదృష్టం అన్నారు.
Hyderabad Crime: నర్సుపై డాక్టర్ అసభ్య ప్రవర్తన.. కారులో ఎక్కించుకుని..
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!