CM Revanth Reddy: ఈరోజు తప్పితే దసరా వరకు కుదరదట.. భూమి పూజపై రేవంత్ కీలక వ్యాఖ్యలు..
- పది సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి తెలంగాణ తల్లి విగ్రహం..
- ఈరోజు తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని పండితులు..
- వేద పండితుల సలహా మేరకు ఈరోజు ప్రారంభించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఈరోజు తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని, పండితులు తెలిపారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసుకోవడం మంచి పరిణామం అన్నారు. పది సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి తెలంగాణ తల్లి విగ్రహం గురైందన్నారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని భావించామన్నారు. వేద పండితుల సలహా మేరకు ఈరోజు ప్రారంభించామన్నారు. ఈరోజు తప్పితే దసరా వరకు మంచి రోజులు లేవని పండితులు తెలిపారు. సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కనిదంటూ ఏది లేదని.. తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారన్నారు. సోనియాగాంధీ మాట శిలా శాసనం అని తెలిపారు. 2014 ,24 వరకు ఎన్నోన్నో నిర్మించామని చెప్పారన్నారు. పది సంవత్సరాలు పరిపాలన చేసిన వారు తెలంగాణ తల్లిని మరుగున పడేశారన్నారు. అన్నీ నేనే అని చెప్పారన్నారు. ప్రగతి భవన్ పేరుతో గడిని నిర్మించుకుని.. పోలీసులను పహారగా పెట్టారన్నారు. తెలంగాణ ప్రజలను ప్రగతి భవన్ లోకి రాకుండా దూరం పెట్టారని తెలిపారు.
Read also: Constables Suspended: లంచాలు, యువతులతో ఖాకీల రాసలీలు.. సస్పెండ్ చేసిన హైదరాబాద్ సీపీ
Also Read
ప్రభుత్వ పాలనకు గుండెకాయ సచివాలయం అన్నారు. నాటి మంత్రులు ప్రజలకు అందుబాటులో లేరన్నారు. ఇరవై రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కానీ తెలంగాణ తల్లి విగ్రహం కోసం మహా అయితే కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి మనుసు రాలేదు నాటి ప్రభుత్వానికన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం లేక పోవడం లోటుగా భావించమన్నారు. మేధావుల సూచనల మేరకు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టామని తెలిపారు. కొందరు తమ కోసం సెక్రటేరియట్ ముందు స్థలం ఏర్పాటు పెట్టుకున్నారన్నారు. జూన్ 2న చెప్పిన.. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పామని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎమ్ కోరుకుంటూ నారో జేఎన్టియు ఫైన్ ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ కు తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించే భాద్యత ఇచ్చామన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైన రోజు డిసెంబర్ 9, సోనియాగాంధీ జన్మదినోత్సవమని.. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండుగ రోజన్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, ఈ అవకాశం నాకు రావడం నా అదృష్టం అన్నారు.
Hyderabad Crime: నర్సుపై డాక్టర్ అసభ్య ప్రవర్తన.. కారులో ఎక్కించుకుని..
తాజావార్తలు
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
-
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!