Konda Surekha: తెలంగాణ అసెంబ్లీలో లాబీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఉండాలని చట్ట సవరణ చేశాం.. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది.. కానీ, యాదగిరిగుట్ట బోర్డుకు ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటుంది అని తెలిపారు. హైదరాబాద్ కు ఏపీ ముఖ్యమంత్రి వస్తే.. చంద్రబాబును కలిసి టీటీడీ సిఫారసు లేఖలను అనుమతించాలని అడుగుతాను అని పేర్కొన్నారు. కనీసం మా లెటర్ కూడా టీటీడీలో పనిచేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. మేము ఇష్టారీతిలో ఎవరికి పడితే వారికి లెటర్ ఇవ్వడం లేదు.. అయినా ఇప్పుడు ఎందుకు ఆపారో తెలియడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. దైవ దర్శనాల దగ్గర అభ్యంతరాలు పెట్టడం సరైంది కాదు అని మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు.
Read Also: Harish Rao: ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం..
ఇక, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు పొట్టి శ్రీరాములు పేరు పెడితే.. మేము ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయమని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వివాదాలు సృష్టంచే విధంగా బీజేపీ సభ్యులు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. ఇక, సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్ కు తెలిసినంతగా ఎవరికి తెలియదు అని ఎద్దేవా చేశారు. ఆర్కీయాలజీ, దేవాదాయ, టూరిజం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల యూనిట్ గా చేస్తేనే.. టెంపుల్ టూరిజం పెరుగుతుంది అని చెప్పుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం సహాకరించకుండా పురాతన దేవాలయాలను అభివృద్ధి చేయడం సాధ్యం కాదు.. నాకు పురాతన ఆలయాల అభివృద్ధి కోసం రోజు దరఖాస్తులు వస్తున్నాయి.. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న భూములను రక్షిస్తాం.. అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు మహిళా సంఘాలకు లీజ్ కు ఇస్తామన్నారు. దేవాలయాల్లో ఉన్న బంగారానికి సంబంధించిన వివరాలు తెప్పిస్తున్నాం.. ఒక్క వేములవాడలోనే 60 కేజీల గోల్డ్ ఉంది.. అన్నీ దేవాలయాలను ఓకే గొడుకు కిందకు తీసుకువస్తాం.. ప్రతీ గుడి ఖర్చులను థర్డ్ పార్టీతో ఆడిట్ చేయిస్తామని మంత్రి కొండా సురేఖ వెల్లడించింది.