Kishan Reddy: గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నత విద్య పొందిన వారే టీచర్స్ గా ఉంటారు..
- నవంబరు 8వ తేదీన జరగనున్న దిశ మీటింగ్..
- హైదరాబాద్ నగర అభివృద్ధి- ప్రభుత్వ పాఠశాలలపై అధికారులతో చర్చిస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నత విద్య పొందిన వారే టీచర్స్ గా ఉంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సీతాఫల్ మండి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జామై ఉస్మానియా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో BDL వారి సహకారంతో టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్, ఫర్నిచర్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అధికశాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం పొందుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నప్పటికీ పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలే దేశానికి పట్టుగొమ్మలు. రానున్న రోజుల్లో మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
Read also: Ponnam Prabhakar: కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదు..
Also Read
సమాజం అంతా ప్రభుత్వ స్కూళ్లను మెరుగుపర్చేలా బాధ్యత తీసుకోవాలన్నారు. వివిధ స్కూళ్లలో విద్యార్థులకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి, పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలన్నారు. మన గుడి-మన బడి. అందుకే.. పాఠశాలల్లో పరిశుభ్రత పాటించి, ఆరోగ్యంగా ఉండేలా దోహదపడాలని తెలిపారు. దేశంలో స్వచ్ఛభారత్ కారణంగా అనేక మంది ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ల్యాబ్స్, ఫర్నిచర్ తో పాటు పరిశుభ్రత దృష్ట్యా హైప్రెషర్ టాయ్లెట్ క్లీనింగ్ మిషన్లను అందజేయడం జరుగుతోందని అన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నత విద్య పొందిన వారే టీచర్స్ గా ఉంటారన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల ఒత్తిడికి, మానసిక ఇబ్బందులకు గురికావొద్దు. పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లలో చేర్పించాల్సిన బాధ్యతను పేరెంట్స్ తీసుకోవాలన్నారు.
Read also: Medak Crime: దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి..
ప్రైవేటు స్కూళ్లకు మేం వ్యతిరేకం కాదు.. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన ఫలితాలు వచ్చేలా రాజకీయ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రతిఒక్కరు చొరవ తీసుకోవాలని తెలిపారు. నవంబరు 8వ తేదీన జరగనున్న దిశ మీటింగ్ లో హైదరాబాద్ నగర అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలపై అధికారులతో చర్చిస్తామన్నారు. సీతాఫల్ మండి హైస్కూల్ కొత్త బిల్డింగ్ నిర్మాణం, అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో విద్యావ్యవస్థ మెరుగుపర్చుకోవాలని తెలిపారు. 33 సంవత్సరాల తర్వాత దేశంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ప్రాథమిక విద్యకు ప్రాధాన్యతనిచ్చే విధంగా, ప్రోత్సహించేలా మాతృభాషను రక్షించుకునేలా విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. హైస్కూల్స్ లో కూడా వివిధ రకాల ఒకేషనల్ కోర్సులను తీసుకువచ్చేలా నూతన విద్యావిధానాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలన్నారు.
Ramayan : ఇంతకీ రణబీర్, సాయిపల్లవిల రామాయణం ఉన్నట్లా లేనట్లా ?
తాజావార్తలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!