Kishan Reddy: గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నత విద్య పొందిన వారే టీచర్స్ గా ఉంటారు..
- నవంబరు 8వ తేదీన జరగనున్న దిశ మీటింగ్..
- హైదరాబాద్ నగర అభివృద్ధి- ప్రభుత్వ పాఠశాలలపై అధికారులతో చర్చిస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నత విద్య పొందిన వారే టీచర్స్ గా ఉంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సీతాఫల్ మండి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జామై ఉస్మానియా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో BDL వారి సహకారంతో టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్, ఫర్నిచర్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అధికశాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం పొందుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నప్పటికీ పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలే దేశానికి పట్టుగొమ్మలు. రానున్న రోజుల్లో మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
Read also: Ponnam Prabhakar: కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదు..
Also Read
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
- Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
సమాజం అంతా ప్రభుత్వ స్కూళ్లను మెరుగుపర్చేలా బాధ్యత తీసుకోవాలన్నారు. వివిధ స్కూళ్లలో విద్యార్థులకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి, పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలన్నారు. మన గుడి-మన బడి. అందుకే.. పాఠశాలల్లో పరిశుభ్రత పాటించి, ఆరోగ్యంగా ఉండేలా దోహదపడాలని తెలిపారు. దేశంలో స్వచ్ఛభారత్ కారణంగా అనేక మంది ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ల్యాబ్స్, ఫర్నిచర్ తో పాటు పరిశుభ్రత దృష్ట్యా హైప్రెషర్ టాయ్లెట్ క్లీనింగ్ మిషన్లను అందజేయడం జరుగుతోందని అన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నత విద్య పొందిన వారే టీచర్స్ గా ఉంటారన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల ఒత్తిడికి, మానసిక ఇబ్బందులకు గురికావొద్దు. పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లలో చేర్పించాల్సిన బాధ్యతను పేరెంట్స్ తీసుకోవాలన్నారు.
Read also: Medak Crime: దారుణం.. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి..
ప్రైవేటు స్కూళ్లకు మేం వ్యతిరేకం కాదు.. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన ఫలితాలు వచ్చేలా రాజకీయ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రతిఒక్కరు చొరవ తీసుకోవాలని తెలిపారు. నవంబరు 8వ తేదీన జరగనున్న దిశ మీటింగ్ లో హైదరాబాద్ నగర అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలపై అధికారులతో చర్చిస్తామన్నారు. సీతాఫల్ మండి హైస్కూల్ కొత్త బిల్డింగ్ నిర్మాణం, అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో విద్యావ్యవస్థ మెరుగుపర్చుకోవాలని తెలిపారు. 33 సంవత్సరాల తర్వాత దేశంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ప్రాథమిక విద్యకు ప్రాధాన్యతనిచ్చే విధంగా, ప్రోత్సహించేలా మాతృభాషను రక్షించుకునేలా విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. హైస్కూల్స్ లో కూడా వివిధ రకాల ఒకేషనల్ కోర్సులను తీసుకువచ్చేలా నూతన విద్యావిధానాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలన్నారు.
Ramayan : ఇంతకీ రణబీర్, సాయిపల్లవిల రామాయణం ఉన్నట్లా లేనట్లా ?
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?