Ramayan : ఇంతకీ రణబీర్, సాయిపల్లవిల రామాయణం ఉన్నట్లా లేనట్లా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayan : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్తో బాలీవుడ్లో ‘రామాయణం’ ను తెరకెక్కిస్తున్నారు.ఈ రామాయణంలో శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటించనున్నట్లు గత కొంత కాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇందులో మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. 2025 దీపావళికి రామాయణం పార్ట్-1ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అప్పుడెప్పుడో వచ్చిన సమాచారమే కానీ మళ్లీ మధ్యలో ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్స్ ఆ ప్రాజెక్ట్ గురించి రాలేదు. దీంతో అసలు రామాయణం ఉందా లేదా అని సినీ ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Garudan : బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టైటిల్ ఇదే..
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఐతే, ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్దిరోజుల్లోనే ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో, మేకర్స్ ప్రస్తుతం ముంబైలో ఇండోర్ షూటింగ్ చేస్తున్నారు. ఐతే ఈ నెల నాలుగో వారం నుంచి జరగబోయే కొత్త షెడ్యూల్ లో సాయి పల్లవి పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తుంది. ఈ సన్నివేశాలు సినిమాలోనే కీలకం అని, ముఖ్యంగా సాయిపల్లవి నటనను ఎలివేట్ చేసే ఈ సీన్లతో ఆమె నటన స్థాయి మరో మెట్టుకు ఎదుగుతుందని తెలుస్తోంది. అన్నట్టు కన్నడ స్టార్ హీరో యష్ ఈ మూవీ ప్రొడక్షన్ లో కూడా భాగమయ్యారు. ఆయన సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతుంది.
Read Also:Ponnam Prabhakar: కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదు..
రామాయణం సినిమాలో కీలకపాత్రలు చేయనున్న బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి, కన్నడ స్టార్ యశ్కు ఇప్పటికే లుక్ టెస్టులు, ప్రీ-విజువలైజేషన్, టెక్ రిహార్సల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కూడా భారీగా ఉండనుంది. టెక్నికల్గా అత్యంత అడ్వాన్డ్స్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని దర్శకుడు నితేశ్ తీవారీ భావిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆస్కార్ అవార్డులను గెలిచిన వీఎఫ్ఎక్స్ కంపెనీ డీఎన్ఈడీని ఆయన నియమించుకున్నారు. హాలీవుడ్ టెక్నిషియన్లు.. ఈ చిత్రం కోసం ఇండియాకు వచ్చే పని చేయనున్నారని సమాచారం. నొయిడాలోని ఫిల్మ్ సిటీలో మూవీ ఎక్కువ భాగం షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ రామాయణంలో హనుమంతుడిగా సన్నీ డియోల్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్ నటించడం దాదాపు ఖరారైనట్లు సమాచారం. కైకేయి పాత్రలో లారా దత్త అలాగే శూర్పనఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారని సమాచారం.. దశరథుడి పాత్ర కోసం దిగ్గజ యాక్టర్ అమితాబ్ బచ్చన్తో మూవీ టీమ్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!