Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. రేవంత్, ఈటల, రఘునందన్ టార్గెట్!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
- గత ఎన్నికల సమయంలో 600 మంది ఫోన్లు ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు..
- రేవంత్, ఈటల, అరవింద్, రఘునందన్ రావు ఫోన్లు ట్యాపింగ్..
- అప్పటి బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాధారణ ఎన్నికల సమయంలోని నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ కి పాల్పడినట్లు తేలింది. నవంబర్ 15వ తేదీన 600 మంది ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లే గుర్తించారు. సాధారణ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు ప్రణీత అండ్ గ్యాంగ్ పాల్పడింది. ఒకే రోజు 600 ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. ఇక, మావోయిస్టుల పేరు చెప్పి ప్రభాకర్ రావు ఫోన్లు ట్యాప్ చేశారు. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని మావోయిస్టుల సానుభూతిపరుల పేర్లతో ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల మీద ప్రభాకర్ రావు నెంబర్లు ఇచ్చినట్లు సమాచారం.
Read Also: Se*xual Assault: జైలు నుండి విడుదలై రెండు రోజులు కాలేదు.. 80 ఏళ్ల వృద్ధ మహిళపై అత్యాచారం..!
Also Read
అయితే, సాధారణ ఎన్నికల్లో మావోయిస్టుల యాక్టివ్ అయ్యారని కమిటీకి ప్రభాకర్ రావు చెప్పారు. మావోయిస్టుల పేరుతో అధికార, ప్రతిపక్ష, వ్యాపార రంగానికి చెందిన వారితో పాటు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయిందన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు కీలక నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తేలింది. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిర్ధారించినట్లు తెలుస్తుంది. అప్పటి బీఆర్ఎస్ అధికారపక్ష నాయకుల ఎమ్మెల్యేల ఫోన్లు సైతం ట్యాప్ అయినట్లు సమాచారం. ట్యాపింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థను ప్రభాకర్ రావు ఏర్పాటు చేసుకున్నారు.
ఇక, శ్రవణ్ రావు ద్వారా సమాచారం తెప్పించుకొని ప్రణీతరావుకు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చారు. ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భుజంగరావుకు ప్రణీత్ రావు ఇచ్చాడు. భుజంగరావు నేరుగా ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి స్థితిగతులను వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుల వైపు ఎవరైనా వెళ్తుంటే, వెంటనే అధికారపక్ష నేతలకు ఫోన్ చేసి భుజంగరావు సమాచారం ఇచ్చారని తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై నిఘా పెట్టి పోలీసులతో దాడులు చేయించారు. వ్యాపారవేత్తలపై దాడుల కోసం రాధాకిషన్ ను ప్రభాకర్ రావు ఉపయోగించాడు. ఎవరైనా డబ్బులు తీసుకెళ్తుంటే వెంటనే ట్యాప్ చేసి అధికారులు పట్టుకున్నారు.
తాజావార్తలు
-
Jamun: రోజుకు 8 నుంచి 10 నేరేడు పండ్లు.. డాక్టర్లు చెప్పిన ఆరోగ్య రహస్యం!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
Virat Kohli: “నా పని అయిపోయింది.. మళ్లీ ఆడాలనుకోవడం లేదు”.. కోహ్లీ షాకింగ్ స్టేట్మెంట్..
-
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి!
-
Vijay – Trisha : అన్ఫాలో చేసిన త్రిష.. విజయ్తో ఇక బ్రేకప్?
ట్రెండింగ్
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!