Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. రేవంత్, ఈటల, రఘునందన్ టార్గెట్!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
- గత ఎన్నికల సమయంలో 600 మంది ఫోన్లు ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు..
- రేవంత్, ఈటల, అరవింద్, రఘునందన్ రావు ఫోన్లు ట్యాపింగ్..
- అప్పటి బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు వెల్లడి..
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాధారణ ఎన్నికల సమయంలోని నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ కి పాల్పడినట్లు తేలింది. నవంబర్ 15వ తేదీన 600 మంది ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లే గుర్తించారు. సాధారణ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు ప్రణీత అండ్ గ్యాంగ్ పాల్పడింది. ఒకే రోజు 600 ఫోన్లను ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. ఇక, మావోయిస్టుల పేరు చెప్పి ప్రభాకర్ రావు ఫోన్లు ట్యాప్ చేశారు. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని మావోయిస్టుల సానుభూతిపరుల పేర్లతో ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల మీద ప్రభాకర్ రావు నెంబర్లు ఇచ్చినట్లు సమాచారం.
Read Also: Se*xual Assault: జైలు నుండి విడుదలై రెండు రోజులు కాలేదు.. 80 ఏళ్ల వృద్ధ మహిళపై అత్యాచారం..!
Also Read
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
అయితే, సాధారణ ఎన్నికల్లో మావోయిస్టుల యాక్టివ్ అయ్యారని కమిటీకి ప్రభాకర్ రావు చెప్పారు. మావోయిస్టుల పేరుతో అధికార, ప్రతిపక్ష, వ్యాపార రంగానికి చెందిన వారితో పాటు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయిందన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు కీలక నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తేలింది. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిర్ధారించినట్లు తెలుస్తుంది. అప్పటి బీఆర్ఎస్ అధికారపక్ష నాయకుల ఎమ్మెల్యేల ఫోన్లు సైతం ట్యాప్ అయినట్లు సమాచారం. ట్యాపింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థను ప్రభాకర్ రావు ఏర్పాటు చేసుకున్నారు.
ఇక, శ్రవణ్ రావు ద్వారా సమాచారం తెప్పించుకొని ప్రణీతరావుకు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చారు. ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భుజంగరావుకు ప్రణీత్ రావు ఇచ్చాడు. భుజంగరావు నేరుగా ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి స్థితిగతులను వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుల వైపు ఎవరైనా వెళ్తుంటే, వెంటనే అధికారపక్ష నేతలకు ఫోన్ చేసి భుజంగరావు సమాచారం ఇచ్చారని తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై నిఘా పెట్టి పోలీసులతో దాడులు చేయించారు. వ్యాపారవేత్తలపై దాడుల కోసం రాధాకిషన్ ను ప్రభాకర్ రావు ఉపయోగించాడు. ఎవరైనా డబ్బులు తీసుకెళ్తుంటే వెంటనే ట్యాప్ చేసి అధికారులు పట్టుకున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?