Jagga Reddy: సీఎం రేవంత్ అపాయింట్మెంట్ తీసుకోండి.. కేసీఆర్ కు జగ్గారెడ్డి సూచన
- ప్రభుత్వానికి- బ్యాంకర్లకు మధ్య ఆన్లైన్ సిస్టం దెబ్బ తీశారు కేసీఆర్..
- అందుకే రుణమాఫీ ఆలస్యం అవుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: సీఎం రేవంత్ నీ కేసీఆర్ అపాయింట్ మెంట్ అడుగు.. ఇవ్వడా.. సచివాలయం వెళ్లి సమస్యలపై చర్చ చెయ్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రకటన చేస్తే.. వాటికి ఎప్పుడైనా విలువ ఉందా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా మాటకు కట్టుబడి ఉన్నారా..? అని మండిపడ్డారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే.. మాకెందుకు అధికారం ఇస్తారు ప్రజలు అని తెలిపారు. సీఎం రేవంత్… కేసీఆర్ నీ అసెంబ్లీ కి రండి.. మాకు సలహాలు సూచనలు ఇవ్వండి అని అడిగారు.. అయినా రాలేదన్నారు. తెలంగాణలో రివర్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ పెడితే… ప్రతిపక్ష నాయకుడు వస్తారు.. సీఎంలు సరిగా రారన్నారు. కానీ తెలంగాణలో సీఎం రేవంత్… ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నీ సభకు రండి అని పిలిచే పరిస్థితి వచ్చిందన్నారు. బయట మాట్లాడే కేసీఆర్.. సభలోకి వచ్చి రుణమాఫీ గురించి మాట్లాడొచ్చు కదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ పెట్టండి సమస్యలపై మాట్లాడాలి అని ప్రతిపక్ష నాయకుడు అడగాలి.. కానీ సీఎం అసెంబ్లీ పెట్టీ ప్రతిపక్ష నాయకుడి నీ సభకు రండి అని పిలిచే పరిస్థితి వచ్చిందన్నారు.
Read also: CM Revanth Reddy: సచివాలయంలో సీఎం రేవంత్ కు వేములవాడ అర్చకుల ఆశీర్వాదం..
Also Read
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
- Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
సీఎం గా సచివాలయం రాలేదు..ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ కి కూడా రావడం లేదన్నారు. రేవంత్ నీ కేసీఆర్ అపాయింట్ మెంట్ అడుగు.. ఇవ్వడా.. సచివాలయం వెళ్లి సమస్యలపై చర్చ చెయ్ అన్నారు. సీఎం అందుబాటులో లేరా? అని ప్రశ్నించారు. మీ హయంలో ప్రతిపక్ష నాయకులకు అపాయింట్ మెంట్ ఇవ్వలేని పరిస్థితి.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రుణమాఫీ మేము ఇచ్చిన మాట ప్రకారం 9 నెలల్లో చేశామన్నారు. రుణమాఫీ కోసం 12 వేల కోట్లు నిధులు రెడీగా ఉన్నాయన్నారు. సమస్య 2 లక్షల రుణాల విషయంలోనే.. కేసీఆర్ తొమ్మిదిన్నర యేండ్లలో సిస్టం అంతా ఖరాభ్ చేశారని కీలక వ్యాక్యలు చేశారు. ప్రభుత్వానికి.. బ్యాంకర్లకు మధ్య ఆన్లైన్ సిస్టం దెబ్బ తీశారు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. అందుకే ఆలస్యం అవుతుందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల విధానం కూడా దెబ్బతిశారు కేసీఆర్ అన్నారు. ఇంటింటి సర్వే చేస్తున్నది సర్కార్..సెప్టెంబర్ నెలాఖరు వరకు అందరికీ మాఫీ ఐపోతుందన్నారు. హరీష్ రావు అధికారం మజా లో ఉన్నాడన్నారు. హరీష్ కి లెక్కలే రావు.. ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడన్నారు. మేన మామ చెప్పింది చేయడమే హరీష్ రావు పని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ వస్తారు..అసలు సంబరాలు అక్కడ చేస్తామన్నారు.
Harish Rao: ముఖ్యమంత్రి సారుకు ఇవేవీ పట్టవు.. హరీష్ రావ్ ట్వీట్ వైరల్..
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!