Kaleshwaram Report: కాళేశ్వరం కమిషన్పై హైకోర్టులో హాట్ హాట్గా కొనసాగుతున్న వాదనలు..
- కాళేశ్వరం కమిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ..
- కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు..
- కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్..
- కేసీఆర్ కు నోటీసు ఇవ్వకుండా ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారు: లాయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram Report: కాళేశ్వరం కమిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ హాట్ హాట్ గా కొనసాగుతుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని న్యాయస్థానంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు ఆర్యమ సుందరం, శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా గూలాబీ బాస్ తరపు లాయర్ వాదిస్తూ.. కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీసేలా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఉందన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వకుండా ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారని ఆరోపంచారు. కేసీఆర్ అడిగినా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
అలాగే, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా కాళేశ్వరంపై ఓ మంత్రి పవన్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారని లాయర్ తెలిపారు. దీంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.. 60 పేజీల కమిషన్ రిపోర్టును మీడియా ప్రతినిధులకు అందజేశారని చెప్పుకొచ్చారు. అనంతరం.. హైకోర్టు బెంచ్ స్పందిస్తూ.. తమకు సమర్పించిన కాళేశ్వరం కాపీ సక్రమంగా లేదని పేర్కొనింది. రిపోర్టు కాపీలో పేజీల సంఖ్య లేకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. దీనిపై బెంచ్ కు హరీష్ రావు తరపు లాయర్ ఆర్యమ సుందరం క్షమాపణ చెప్పారు.
Read Also: Telangana Aarogyasri: తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్!
మరోవైపు, కాళేశ్వరం కమీషన్ రిపోర్టుపై విచారణను హైకోర్టు మధ్యాహ్ననికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కాళేశ్వరం కమిషన్ తరపున సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని అంశాలను పరిశీలించే కమిషన్ విచారణ చేసింది.. చర్యలు తీసుకునే అంశంపై కమిషన్ ఎలాంటి సిఫార్సు చేయలేదు.. అసెంబ్లీ వేదికగా చర్చిస్తామని చెప్పడం సబబే.. రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వ్యూలు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
-
Ben Stokes Returns: ‘క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది’.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
-
Story Board : పంజా విసురుతున్న ఎల్నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!