Hyderabad CP: వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలే.. పోలీసులకు సీపీ వార్నింగ్..
- పోలీసుల అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు..
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad CP: పోలీసులు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. లంచాలు, వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోని ఉన్నతాధికారులపై నిఘా ఉంచుతామని కొత్తకోట శ్రీనివాస్ అన్నారు. ఆరోపణ నిజమైతే ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని హెచ్చరించారు. కాగా.. హైదరాబాద్లో మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంతో నగర పౌరులకు సీపీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల బోయినపల్లిలో రూ.8.5 కోట్ల విలువైన 8.5 కిలోల మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు.
Read also: Telangana Governor: నేడు ములుగు, భూపాలపల్లిల్లో రాష్ట్ర గవర్నర్ పర్యటన
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలో యాంఫెటమైన్ అనే డ్రగ్ పెద్ద మొత్తంలో పట్టుబడిందన్నారు. ఈ మందులను ఇంజక్షన్లు, లిక్విడ్ రూపంలో వివిధ రూపాల్లో తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. కూల్ డ్రింక్స్ లో అమ్మాయిలకు ఈ మందు ఇస్తున్నారని తెలిపారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎవరిపైనా అయిన అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. నగర యువత డ్రగ్స్ బారిన పడవద్దని హెచ్చరించారు. ఈ కేసులో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని సీపీ శ్రీనివాస్ అన్నారు.
Read also: MLC Kavitha: నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..
పార్టీలకు వెళ్లే యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలిసో తెలియకో ఎవరో ఒకరు డ్రగ్స్ ను అలవాటు చేసేందుకు పాల్పడుతుంటారని అన్నారు. కూల్ డ్రింక్స్ లో కలుపుతారని.. కాబట్టి యువత పార్టీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్తగా డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ పరీక్షల కోసం TSNAB ప్రత్యేకంగా ఒక కిట్ను రూపొందించింది. డ్రగ్స్ వినియోగదారులు, గంజాయి వినియోగదారులను గుర్తించడానికి ఎబోన్ యూరిన్ కప్ యంత్రంతో పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ కిట్ను ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని పోలీస్ స్టేషన్లలో పరీక్షలు ప్రారంభమయ్యాయి.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు..
తాజావార్తలు
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!