MLC Kavitha: నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..
- సుప్రీం కోర్టులో నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ..
- విచారణ జరపనున్న జస్టిస్ బి ఆర్ గవాయ్
- జస్టిస్ విశ్వ నాథన్ ల ధర్మాసనం..
MLC Kavitha: సుప్రీం కోర్టులో నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీం కోర్టును కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు, హైకోర్టులు బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో కవిత సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది. మహిళగా, రాజకీయ నేత, ప్రజా ప్రతినిధిగా కవిత బెయిల్ కి అర్హురాలు అంటూ కవిత తరపున వాదనలు వినిపించనున్నారు. కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ విశ్వ నాథన్ ల ధర్మాసనం విచారణ జరపనుంది.
Read also: Adilabad Agency: నేడు ఆదిలాబాద్ ఏజెన్సీ బంద్..
Also Read
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
- Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..
- West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..
కాగా మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న ఢిల్లీకి బయలుదేరిన విషయం తెలిసిందే. వీరితో పాటు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్లారు. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలో వారంతా హస్తినకు వెళ్లారు. కవిత ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసులో సుమారు 6 నెలలుగా తీహార్ జైలులో వున్నారు.
Read also: Patika Bellam: పటిక బెల్లంను తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
కానీ ఈ కేసుల్లో ఆమె ట్రయల్, హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టులు తిరస్కరించాయి. దీంతో కవిత సుప్రీం కోర్టుకు ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవాళ సుప్రీంకోర్టు వెలువరించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు కూడా బెయిల్ లభించింది. దీంతో కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటు కవిత ఆరోగ్యం కూడా బాగా లేకపోవడంతో ఆమెకు బెయిల్ వస్తుందని భావిస్తున్నారు. బెయిల్ రాకపోతే సీబీఐ, ఈడీ తీరుకు నిరసనగా బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
PM Modi: ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ఫోన్.. కీలక అంశాలపై చర్చ..!
తాజావార్తలు
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
-
Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!