Harish Rao Vs Seethakka: అసెంబ్లీలో సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై హరీష్ vs సీతక్క..
- సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం..
- సర్పంచ్ ల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు..
- హరీష్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానం..
- సర్పంచ్ ల పెండింగ్ బిల్లులపై హరీష్ vs సీతక్క మాటలతో దద్దరిల్లిన అసెంబ్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Vs Seethakka: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ల పెండింగ్ బిల్లులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హరీష్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానమిస్తూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలన పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. దీంతో హరీష్ రావు వర్సెస్ సీతక్క వాదనలతో అసెంబ్లీ దద్దరిల్లింది.
Read also: Telangana Assembly Live 2024: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
Also Read
సర్పంచ్లకు చెల్లించాల్సిన రూ.691 కోట్లు గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్నాయని హరీష్ రావు గుర్తు చేశారు. నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే ఎక్కడికక్కడ సర్పంచ్ లను అరెస్టు చేశారని తెలిపారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించింది బడా కాంట్రాక్టర్లకు అన్నారు. బడా కాంట్రాక్టర్లకు రూ. 1200 కోట్లు.. చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలకు మాత్రం ఒక్క పైసా కూడా అందలేదని తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు ముందు పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, ఎప్పుడు క్లియర్ చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Read also: Harish Rao: బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు కానీ, సర్పంచులకు లేదు..
అనంతరం హరీష్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. 2014 నుంచి సర్పంచ్ ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, గత ప్రభుత్వం ఆ బిల్లులు ఎందుకు చెల్లించలేకపోయిందో సమాధానం చెప్పాలన్నారు. సర్పంచ్ బిల్లుల గురించి అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్ రావుకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ రోజు తమకేమీ తెలియనట్లు బీఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పల్లె ప్రగతి నిధులు విడుదల చేయకపోవడంతో బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ ల పెండింగ్ బిల్లులపై మంత్రి సీతక్క సరైన సమాధానం చెప్పలేదని బీఆర్ ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. వాకౌట్ అనంతరం తిరిగి అసెంబ్లీకి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.
Kaushik Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలి.. కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!