Telangana: అర్ధరాత్రి రోడ్డెక్కిన నిరుద్యోగులు.. రంగంలోకి సీఆర్పీఎఫ్ బలగాలు..
- దిల్ సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ లో నిరుద్యోగుల పెద్ద ఎత్తున ధర్నా..
- భారీ సంఖ్యలో హాజరైన నిరుద్యోగులు..
- రంగంలోకి పోలీసులు-సీఆర్పీఎఫ్ బలగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: గ్రూప్-2 పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతొ రాష్ట్రంలోని నిరుద్యోలు అందరూ శనివారం అర్థరాత్రి నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. గ్రూప్ -2, గ్రూప్ -3 పోస్టుల పెంపుతో పాటు డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి అశోక్ నగర్ చౌరస్తాలో వేలాది మంది నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. చౌరస్తాలోని రోడ్డుపైనే కూర్చుని ధర్నా చేపట్టారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అక్కడే రాస్తా రోకో చేపట్టారు.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే.?
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ఇక మరోవైపు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్ సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ చౌరస్తాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంకటాద్రి థియేటర్ నుంచి మెట్రో స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. రాజీవ్చౌక్ వద్ద ధర్నా. డీఎస్సీని వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మాకు న్యాయం జరగాలన్నారు. తమ సమస్యను రాష్ట్ర భవిష్యత్తు కోణంలో చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయమైన డిమాండ్లతో తమ ధర్నాలను రాజకీయం చేయడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో దిల్సుఖ్నగర్తో పాటు ఎల్బీనగర్లోనూ పోలీసులు భారీగా మోహరించారు.
Read also: IND vs PAK: అంబటి రాయుడు హాఫ్ సెంచరీ.. పాకిస్థాన్పై భారత్ ఘన విజయం! 15 రోజుల్లో రెండు కప్స్
నిరుద్యోగుల మెరుపు ధర్నాతో అశోక్నగర్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, చిక్కడప్లలి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది. గంటల తరబడి వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. మరోవైపు అశోక్నగర్లో ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో దోమలగూడ, ముషీరాబాద్ పీఎస్లతోపాటు రోడ్లపై అదనపు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. నిరుద్యోగులను బలవంతంగా పంపించే ప్రయత్నం చేశారు. అయితే తమ డిమాండ్లు సాధించే వరకు ఉద్యమించేది లేదని అభ్యర్థులు రోడ్లపైనే కూర్చున్నారు. అర్ధరాత్రి దాటినా పరిస్థితి అదుపులోకి రాలేదు.
Raviteja : మాస్ రాజా పవర్ మరోసారి చూపించేందుకు ఏర్పాట్లు…
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!