Telangana: అర్ధరాత్రి రోడ్డెక్కిన నిరుద్యోగులు.. రంగంలోకి సీఆర్పీఎఫ్ బలగాలు..
- దిల్ సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ లో నిరుద్యోగుల పెద్ద ఎత్తున ధర్నా..
- భారీ సంఖ్యలో హాజరైన నిరుద్యోగులు..
- రంగంలోకి పోలీసులు-సీఆర్పీఎఫ్ బలగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: గ్రూప్-2 పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతొ రాష్ట్రంలోని నిరుద్యోలు అందరూ శనివారం అర్థరాత్రి నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. గ్రూప్ -2, గ్రూప్ -3 పోస్టుల పెంపుతో పాటు డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి అశోక్ నగర్ చౌరస్తాలో వేలాది మంది నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. చౌరస్తాలోని రోడ్డుపైనే కూర్చుని ధర్నా చేపట్టారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అక్కడే రాస్తా రోకో చేపట్టారు.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే.?
Also Read
- Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ఇక మరోవైపు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు దిల్ సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ చౌరస్తాలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంకటాద్రి థియేటర్ నుంచి మెట్రో స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. రాజీవ్చౌక్ వద్ద ధర్నా. డీఎస్సీని వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మాకు న్యాయం జరగాలన్నారు. తమ సమస్యను రాష్ట్ర భవిష్యత్తు కోణంలో చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయమైన డిమాండ్లతో తమ ధర్నాలను రాజకీయం చేయడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో దిల్సుఖ్నగర్తో పాటు ఎల్బీనగర్లోనూ పోలీసులు భారీగా మోహరించారు.
Read also: IND vs PAK: అంబటి రాయుడు హాఫ్ సెంచరీ.. పాకిస్థాన్పై భారత్ ఘన విజయం! 15 రోజుల్లో రెండు కప్స్
నిరుద్యోగుల మెరుపు ధర్నాతో అశోక్నగర్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, చిక్కడప్లలి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది. గంటల తరబడి వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. మరోవైపు అశోక్నగర్లో ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో దోమలగూడ, ముషీరాబాద్ పీఎస్లతోపాటు రోడ్లపై అదనపు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. నిరుద్యోగులను బలవంతంగా పంపించే ప్రయత్నం చేశారు. అయితే తమ డిమాండ్లు సాధించే వరకు ఉద్యమించేది లేదని అభ్యర్థులు రోడ్లపైనే కూర్చున్నారు. అర్ధరాత్రి దాటినా పరిస్థితి అదుపులోకి రాలేదు.
Raviteja : మాస్ రాజా పవర్ మరోసారి చూపించేందుకు ఏర్పాట్లు…
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
-
Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
-
Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
-
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
-
ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!