M. Venkaiah Naidu: అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోండి..
- హైదరాబాద్ శిల్పారామంలో నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కళా ప్రదర్శన..
- ఎగ్జిబిషన్ను ప్రారంభించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..
- లోక్ మంథన్ కార్యక్రమంను భాగ్యనగర్ లో నిర్వహించడం చాలా సంతోషకరం..
- మన కళలు, సంస్కృతులు, వాయిద్యాలను రక్షించుకోవాలి..
- ప్రకృతిని ప్రేమించే పవిత్ర మైన జాతి, హిందూ ధర్మం మనది..
M. Venkaiah Naidu: M. Venkaiah Naidu: అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కళా ప్రదర్శనలో భాగంగా.. వెంకయ్య నాయుడు ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రేపు లోక్ మంథన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. కాగా.. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. లోక్ మంథన్ కార్యక్రమంను భాగ్యనగర్ లో నిర్వహించడం చాలా సంతోషకరం అన్నారు. మళ్ళీ తిరిగి మన మూలాలకు వెళ్ళాలన్నారు. మన సాంస్కృతిక వారసత్వాలను కాపాడుకోవాలన్నారు. మన కళలు, సంస్కృతులు, వాయిద్యాలను రక్షించుకోవాలని తెలిపారు. మన సంస్కృతిని, మన భాషను, మన సంప్రదాయాలును మర్చిపోయామన్నారు. ప్రకృతిని ప్రేమించే పవిత్ర మైన జాతి, హిందూ ధర్మం మనదని తెలిపారు. ఇంగ్లీష్ వాడు ఆర్థికంగా దోచుకోవడమే కాదు మన మనస్సును కూడా దోచుకుని వెళ్ళిపోయాడన్నారు.
Read also: CV Anand: పోలీస్ ఉద్యోగం అంటే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లాంటిది..
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
- Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
- IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
దేవుడి దగ్గర పోవాలని అంటే ఇంగ్లీషు రావాలనే షరతులేమి లేవని దేవుడు చెప్పారని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఎవరైనా రావాల్సిందే అని దేవుడు చెప్పారని తెలిపారు. ప్రముఖ వ్యక్తులు మాతృభాషలోనే చదువుకున్నారన్నారు. మోడీ ఇంగ్లీష్ మీడియం మొఖమే చూడలేదన్నారు. మనం భారతీయులం, మనం హిందువలమని గర్వంగా చెప్పుకోవాలని తెలిపారు. ఇంగ్లీష్ వ్యామోహం మంచిది కాదన్నారు. అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీషు నేర్చుకోవాలన్నారు. కుటుంబాలు, పెళ్ళిళ్ళు విచ్ఛిన్నం అవుతున్నాయని తెలిపారు. కుటంబ వ్యవస్థను పటిష్ఠం చేసుకుందామన్నారు. మనశ్శాంతిగా ఉంటే అనుకున్న పలితాలు సాధించవచ్చని అన్నారు. శిల్పారామంలో ప్రజ్ఞవాహిని ఆధ్వర్యంలో లోక్ మంథన్ పేరుతో కళా ప్రదర్శనల పండుగ నిర్వహిస్తున్నారు. నేటి (గురువారం) నుంచి ఆదివారం దాకా వివిధ అంశాలపై చర్చలు, సమావేశాలు జరగనున్నాయి. 12 దేశాల నుంచి 1500 మందికి పైగా కళాకారులు రాకతో సందడి వాతావరణం నెలకొంది. 120కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా.. శిల్పారామంలో నాలుగు రోజుల పాటు ఉచితంగా సందర్శన నిర్వహించనున్నారు.
Telangana Olympic: నేడు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు..
తాజావార్తలు
-
Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
-
OTT Movies : థియేటర్స్లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
-
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
-
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!