M. Venkaiah Naidu: అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోండి..
- హైదరాబాద్ శిల్పారామంలో నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కళా ప్రదర్శన..
- ఎగ్జిబిషన్ను ప్రారంభించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..
- లోక్ మంథన్ కార్యక్రమంను భాగ్యనగర్ లో నిర్వహించడం చాలా సంతోషకరం..
- మన కళలు, సంస్కృతులు, వాయిద్యాలను రక్షించుకోవాలి..
- ప్రకృతిని ప్రేమించే పవిత్ర మైన జాతి, హిందూ ధర్మం మనది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
M. Venkaiah Naidu: M. Venkaiah Naidu: అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కళా ప్రదర్శనలో భాగంగా.. వెంకయ్య నాయుడు ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రేపు లోక్ మంథన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. కాగా.. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. లోక్ మంథన్ కార్యక్రమంను భాగ్యనగర్ లో నిర్వహించడం చాలా సంతోషకరం అన్నారు. మళ్ళీ తిరిగి మన మూలాలకు వెళ్ళాలన్నారు. మన సాంస్కృతిక వారసత్వాలను కాపాడుకోవాలన్నారు. మన కళలు, సంస్కృతులు, వాయిద్యాలను రక్షించుకోవాలని తెలిపారు. మన సంస్కృతిని, మన భాషను, మన సంప్రదాయాలును మర్చిపోయామన్నారు. ప్రకృతిని ప్రేమించే పవిత్ర మైన జాతి, హిందూ ధర్మం మనదని తెలిపారు. ఇంగ్లీష్ వాడు ఆర్థికంగా దోచుకోవడమే కాదు మన మనస్సును కూడా దోచుకుని వెళ్ళిపోయాడన్నారు.
Read also: CV Anand: పోలీస్ ఉద్యోగం అంటే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లాంటిది..
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
దేవుడి దగ్గర పోవాలని అంటే ఇంగ్లీషు రావాలనే షరతులేమి లేవని దేవుడు చెప్పారని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఎవరైనా రావాల్సిందే అని దేవుడు చెప్పారని తెలిపారు. ప్రముఖ వ్యక్తులు మాతృభాషలోనే చదువుకున్నారన్నారు. మోడీ ఇంగ్లీష్ మీడియం మొఖమే చూడలేదన్నారు. మనం భారతీయులం, మనం హిందువలమని గర్వంగా చెప్పుకోవాలని తెలిపారు. ఇంగ్లీష్ వ్యామోహం మంచిది కాదన్నారు. అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీషు నేర్చుకోవాలన్నారు. కుటుంబాలు, పెళ్ళిళ్ళు విచ్ఛిన్నం అవుతున్నాయని తెలిపారు. కుటంబ వ్యవస్థను పటిష్ఠం చేసుకుందామన్నారు. మనశ్శాంతిగా ఉంటే అనుకున్న పలితాలు సాధించవచ్చని అన్నారు. శిల్పారామంలో ప్రజ్ఞవాహిని ఆధ్వర్యంలో లోక్ మంథన్ పేరుతో కళా ప్రదర్శనల పండుగ నిర్వహిస్తున్నారు. నేటి (గురువారం) నుంచి ఆదివారం దాకా వివిధ అంశాలపై చర్చలు, సమావేశాలు జరగనున్నాయి. 12 దేశాల నుంచి 1500 మందికి పైగా కళాకారులు రాకతో సందడి వాతావరణం నెలకొంది. 120కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా.. శిల్పారామంలో నాలుగు రోజుల పాటు ఉచితంగా సందర్శన నిర్వహించనున్నారు.
Telangana Olympic: నేడు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు..
తాజావార్తలు
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!