NTV Effect: జేఎన్టీయూ ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్. క్యాంపస్ కు అడిషనల్ కలెక్టర్..
- సుల్తాన్ పూర్ JNTU ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర సీరియస్..
- మంత్రి ఆదేశాలతో కదిలిన జిల్లా అధికార యంత్రాంగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTV Effect: సుల్తాన్ పూర్ JNTU ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్ అయ్యారు. ఇవాళ చట్నీలో ఎలుక ఈత కొడుతున్న వీడియోను కొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనపై ఎన్ టీవీ సోషల్ మీడియా వేదికగా ప్రచురించింది. ఈ వార్తపై వెంటనే స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులపై సీరియస్ అయ్యారు. వెంటనే సుల్తాన్ పూర్ జేన్టీయూని సందర్శించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం జేఎన్టీయూ క్యాంపస్ కు చేరుకున్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు ఇవాళ జేఎన్టీయూ క్యాంపస్ కి వచ్చి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Read also: Thummala Nageswara Rao: సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ కోసం చైనా నుంచి ఇంజనీర్ లు..
Also Read
విద్యార్థుల భోజనంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయని వాపోయారు. ఈ ఘటనలు కొద్దొరోజులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రిన్స్ పాల్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మాధురి క్యాంపస్ కిచెన్ ను సందర్శించారు. కిచెన్ పరిశుభ్రంగా లేకపోవడంతో అడిషనల్ కలెక్టర్ మాధురి ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గదిలో కనీస జాగ్రత్తలు పాటించారా? అని ప్రిన్సిపాల్, మెస్ కాంట్రాక్టర్ పై ఫైర్ అయ్యారు. మెస్ కాంట్రాక్టర్ ని మార్చాలని ప్రిన్సిపాల్ కి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులే కావాలని చట్నీలో వేశారని ప్రిన్సిపాల్ చెప్పగా.. తినే ఆహారంలో విద్యార్థులు ఎందుకు వేస్తారని జిల్లా అడిషనల్ కలెక్టర్ నిలదీయడంతో ప్రిన్సిపాల్ బదులు చెప్పలేక పోయారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చారించారు. తమ సమస్యలను వెంటనే స్పందించి పరిష్కరించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు, ఈ వార్తను ప్రచురించిన ఎన్ టీవీ యాజమాన్యానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Instagram Reels: అయ్యిందా బాగా అయ్యిందా.. ఇప్పుడు చల్లు రోడ్డుపై నోట్లు..
తాజావార్తలు
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
-
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!