NTV Effect: జేఎన్టీయూ ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్. క్యాంపస్ కు అడిషనల్ కలెక్టర్..
- సుల్తాన్ పూర్ JNTU ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర సీరియస్..
- మంత్రి ఆదేశాలతో కదిలిన జిల్లా అధికార యంత్రాంగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTV Effect: సుల్తాన్ పూర్ JNTU ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్ అయ్యారు. ఇవాళ చట్నీలో ఎలుక ఈత కొడుతున్న వీడియోను కొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనపై ఎన్ టీవీ సోషల్ మీడియా వేదికగా ప్రచురించింది. ఈ వార్తపై వెంటనే స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులపై సీరియస్ అయ్యారు. వెంటనే సుల్తాన్ పూర్ జేన్టీయూని సందర్శించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం జేఎన్టీయూ క్యాంపస్ కు చేరుకున్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు ఇవాళ జేఎన్టీయూ క్యాంపస్ కి వచ్చి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Read also: Thummala Nageswara Rao: సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ కోసం చైనా నుంచి ఇంజనీర్ లు..
Also Read
- Harish Rao : సీఎం రేవంత్కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
- Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
- KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
- Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే 'కమలం' వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
విద్యార్థుల భోజనంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయని వాపోయారు. ఈ ఘటనలు కొద్దొరోజులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రిన్స్ పాల్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మాధురి క్యాంపస్ కిచెన్ ను సందర్శించారు. కిచెన్ పరిశుభ్రంగా లేకపోవడంతో అడిషనల్ కలెక్టర్ మాధురి ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గదిలో కనీస జాగ్రత్తలు పాటించారా? అని ప్రిన్సిపాల్, మెస్ కాంట్రాక్టర్ పై ఫైర్ అయ్యారు. మెస్ కాంట్రాక్టర్ ని మార్చాలని ప్రిన్సిపాల్ కి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులే కావాలని చట్నీలో వేశారని ప్రిన్సిపాల్ చెప్పగా.. తినే ఆహారంలో విద్యార్థులు ఎందుకు వేస్తారని జిల్లా అడిషనల్ కలెక్టర్ నిలదీయడంతో ప్రిన్సిపాల్ బదులు చెప్పలేక పోయారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చారించారు. తమ సమస్యలను వెంటనే స్పందించి పరిష్కరించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు, ఈ వార్తను ప్రచురించిన ఎన్ టీవీ యాజమాన్యానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Instagram Reels: అయ్యిందా బాగా అయ్యిందా.. ఇప్పుడు చల్లు రోడ్డుపై నోట్లు..
తాజావార్తలు
-
T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
-
Harish Rao : సీఎం రేవంత్కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!