CPI Red Salute Rally: తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ రెడ్ సెల్యూట్ ర్యాలీ..
- ముగ్దమ్ మొయినుద్దీన్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సీపీఐ ర్యాలీ..
- రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత సాయుధా పోరాటం చేసిన గుర్తించడం లేదు..
- ఎంఐఎం.. ఆర్ఎస్ఎస్లకు భయపడి సాయుధ పోరాటాన్ని పక్క దారి పట్టిస్తున్నారు: సీపీఐ నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Red Salute Rally: హైదరాబాద్ నగరంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ సీపీఐ రెడ్ సెల్యూట్ ర్యాలీ నిర్వహించింది. కవులు, కళాకారులతో కలిసి ముగ్దమ్ స్టాచ్యు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రెడ్ టీ షర్ట్స్ ధరించి ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంభాశివరావు, చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే గుర్తించబడిన సాయుధ పోరాటం స్టార్ట్ అయినా రోజు.. నిజం నిరంకుశం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసారు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ అధికారంలోకి వచ్చిన సాయుధా పోరాటం చేసిన వారిని గుర్తించండి, వాళ్ళను ఆదుకోండి అని కోరారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా జరిపేందుకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంఐఎం పార్టీ బ్లాక్ మెయిల్ కు భయపడుతోంది అని సీపీఐ నారాయణ ఆరోపించారు.
Read Also: Rohit Sharma-MI: ముంబై ఇండియన్స్తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లే!
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ఇక ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు మాట్లాడుతూ.. ఆనాడు సాయుధ పోరాటం జరగకపోతే తెలంగాణ భారతదేశంలో విలీనం అయ్యేది కాదు అన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా చేస్తున్నారు.. ఎంఐఎం, ఆర్ఎస్ఎస్ లకు భయపడి సాయుధ పోరాటాన్ని పక్క దారి పట్టిస్తున్నారు.. మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టడం సంతోషం.. ఆనాడు సాయుధ పోరాటంలో లేని వారు హిందూ, ముస్లిం మధ్య గొడవలు పెడుతున్నారు అని ఆరోపించారు. సిలబస్ లో సాయుధ పోరాటం చరిత్రను పెట్టాలి అని కూనంనేని డిమాండ్ చేశారు.
Read Also: YS Jagan: చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్..!
కాగా, చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రోజు అన్నారు. బద్దం, రావి నారాయణరెడ్డి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు.. సాయుధ పోరాటం లేకపోతే తెలంగాణ మరో పాకిస్తాన్ గా ఉండేది.. హైదరాబాద్ లో స్మృతివనం ఏర్పాటు చేయండి అని కోరారు. మీరు ఎంఐఎంకు భయపడి అధికారం చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!