YS Jagan: చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్..!
- గుంటూరు జైలుకు వైఎస్ జగన్..
- మాజీ ఎంపీ నందిగం సురేష్కు పరామర్శ..
- చంద్రబాబు సర్కార్ అన్ని రకాలుగా వైఫల్యం చెందిందని విమర్శ..
- బాబు వైఫల్యంతో వరదల వల్ల 60 మంది మృతి..
- అందుకే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: కూటమి ప్రభుత్వం.. సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ను గుంటూరు జైలులో పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్ అన్ని రకాలుగా వైఫల్యం చెందిందన్నారు.. చంద్రబాబు వైఫల్యంతో వరదల వల్ల 60 మంది చనిపోయారని ఆరోపించారు.. అందుకోసమే ఎప్పుడో జరిగిన ఘటనపై టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.. అసభ్య పదజాలంతో దూషించినా.. నేను సంయమనం పాటించా.. కానీ, కొందరు కోపంతో రాళ్లువేసి ఉంటే వేయొచ్చు.. కానీ, ఇప్పుడు అరెస్ట్ అయినవారంతా.. ఆ రోజు ఘటనా ప్రదేశంలో లేనివారే అన్నారు జగన్..
Read Also: Minister Tummala: గోదావరి నీటిమట్టం ఎంత పెరిగిన భద్రాచలం పట్టణంలో చుక్క నీరు రాకుండా చర్యలు..
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
చంద్రబాబు వరదల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అందుకే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు జగన్.. ఆ రోజు టిడిపి కార్యాలయంలో పీసీ పెట్టి.. అప్పుడు సీఎంగా ఉన్న వ్యక్తిని తిట్టారు.. దీంతో వైసీపీ కార్యకర్తలు ధర్నాకు వచ్చారు. నేను చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అన్నారు.. అయితే, ఇప్పుడు పోలీసులే తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.. చంద్రబాబు పాలన గాలికి వదిలేశాడు. తుఫాన్ వస్తుందని ముందే అలెర్ట్ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి వరద వస్తుందని తెలుసు.. ఆరోజే సమీక్ష చేసి ఉంటే.. అధికారులను అప్రమత్తం చేసి ఉంటే.. చర్యలు తీసుకొనే అవకాశం ఉండేదన్నారు..
Read Also: TGVishwaPrasad : పారాలింపిక్స్లో అంధుల క్రికెట్ను చేర్చేందుకు అన్ని విధాలా కృషి చేయాలి
ఇక, ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపై స్పందించిన జగన్.. నిందితులుగా ఉన్న వ్యక్తులు.. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించారు.. చంద్రబాబు, లోకేష్ లతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయన్నారు.. అసలు రామ్మోహన్, చిన్నాలు ఎవరు..? అని ప్రశ్నించారు వైఎస్ జగన్.. ఈ సందర్భంగా మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడిన మాజీ సీఎం వైఎస్ జగన్.. ఏం వ్యాఖ్యలో చేశారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!