YS Jagan: చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్..!
- గుంటూరు జైలుకు వైఎస్ జగన్..
- మాజీ ఎంపీ నందిగం సురేష్కు పరామర్శ..
- చంద్రబాబు సర్కార్ అన్ని రకాలుగా వైఫల్యం చెందిందని విమర్శ..
- బాబు వైఫల్యంతో వరదల వల్ల 60 మంది మృతి..
- అందుకే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఫైర్..
YS Jagan: కూటమి ప్రభుత్వం.. సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ను గుంటూరు జైలులో పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్ అన్ని రకాలుగా వైఫల్యం చెందిందన్నారు.. చంద్రబాబు వైఫల్యంతో వరదల వల్ల 60 మంది చనిపోయారని ఆరోపించారు.. అందుకోసమే ఎప్పుడో జరిగిన ఘటనపై టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది.. అసభ్య పదజాలంతో దూషించినా.. నేను సంయమనం పాటించా.. కానీ, కొందరు కోపంతో రాళ్లువేసి ఉంటే వేయొచ్చు.. కానీ, ఇప్పుడు అరెస్ట్ అయినవారంతా.. ఆ రోజు ఘటనా ప్రదేశంలో లేనివారే అన్నారు జగన్..
Read Also: Minister Tummala: గోదావరి నీటిమట్టం ఎంత పెరిగిన భద్రాచలం పట్టణంలో చుక్క నీరు రాకుండా చర్యలు..
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
చంద్రబాబు వరదల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అందుకే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు జగన్.. ఆ రోజు టిడిపి కార్యాలయంలో పీసీ పెట్టి.. అప్పుడు సీఎంగా ఉన్న వ్యక్తిని తిట్టారు.. దీంతో వైసీపీ కార్యకర్తలు ధర్నాకు వచ్చారు. నేను చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అన్నారు.. అయితే, ఇప్పుడు పోలీసులే తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.. చంద్రబాబు పాలన గాలికి వదిలేశాడు. తుఫాన్ వస్తుందని ముందే అలెర్ట్ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి వరద వస్తుందని తెలుసు.. ఆరోజే సమీక్ష చేసి ఉంటే.. అధికారులను అప్రమత్తం చేసి ఉంటే.. చర్యలు తీసుకొనే అవకాశం ఉండేదన్నారు..
Read Also: TGVishwaPrasad : పారాలింపిక్స్లో అంధుల క్రికెట్ను చేర్చేందుకు అన్ని విధాలా కృషి చేయాలి
ఇక, ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపై స్పందించిన జగన్.. నిందితులుగా ఉన్న వ్యక్తులు.. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించారు.. చంద్రబాబు, లోకేష్ లతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయన్నారు.. అసలు రామ్మోహన్, చిన్నాలు ఎవరు..? అని ప్రశ్నించారు వైఎస్ జగన్.. ఈ సందర్భంగా మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడిన మాజీ సీఎం వైఎస్ జగన్.. ఏం వ్యాఖ్యలో చేశారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీకి నేతలకు సజ్జల హెచ్చరికలు
-
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
-
Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
-
Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!