Constable Suicide: షేర్ మార్కెట్లో కోటి రూపాయల నష్టం..కానిస్టేబుల్ సూసైడ్!
- షేర్ మార్కెట్ లో కోటి రూపాయల నష్టం రావడంతో కానిస్టేబుల్ సూసైడ్..
- మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేష్..
- షేర్ మార్కెట్లో నష్టం రావడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constable Suicide: షేర్ మార్కెట్ లో కోటి రూపాయల నష్టం రావడంతో హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అంబర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ.వెంకటేష్ అంబర్ పేట్ లోని దుర్గా నగర్లో గల తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, షేర్ మార్కెట్లో కోటి రూపాయల నష్టం రావడంతో మనస్థాపానికి గురైన కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కానిస్టేబుల్ వెంకటేష్ స్వస్థలం సూర్యాపేట జిల్లా.. కాగా, అతడికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు.
Read Also: TDP Politburo: నేడు టీడీపీ పొలిట్బ్యూరో భేటీ.. లోకేష్ టీమ్ రెడీ అవుతుందా..?
Also Read
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
- Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
అయితే, 2024లో ఆంధ్రాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో స్కూల్ హెడ్ మాస్టర్గా పని చేస్తున్న భాస్కర్ బాబు స్నేహితులను నమ్మి షేర్ మార్కెట్, ఆన్ లైన్ బిజినెస్లో భారీగా పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మిన భాస్కర్ లోన్ యాప్లు, బ్యాంకులు, సన్నిహితుల దగ్గర అప్పు చేసి మరీ రూ. 60 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. కొంతకాలం పాటు లాభం పేరుతో నెలనెలా డబ్బులు ఇచ్చిన స్నేహితులు 2024 ఏప్రిల్ నుంచి ఎలాంటి లాభం, అసలు కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో అప్పుల భారం పెరిగి బ్యాంకులు, లోన్ యాప్లకు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడ్డాడు. ఒక పక్క ఈఎంఐల టెన్షన్, మరో పక్క అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి రావడంతో.. ఆ బాధలు భరించలేక డిసెంబర్ 22, 2024న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?