CM Revanth Reddy: పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది..
- పార్టీలో పడి పని చేస్తున్నవారికి గుర్తింపు ఉంటుంది..
- పార్టీ కోసం కష్టపడి పని చేసినవారి జాబితా ఇంఛార్జ్ సిద్ధం చేస్తారు..
- మార్చ్ 10వ తేదీలోపు పార్టీ శ్రేణులకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తాం: సీఎం రేవంత్
CM Revanth Reddy: గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది అని తెలిపారు. పని చేసిన వారి జాబితాను కొత్త ఇంఛార్జ్ సిద్ధం చేస్తారు.. కొందరికి పదవులు రాలేదు.. మొదటి విడతలో కార్పొరేషన్ చైర్మన్లు రెండేళ్లు అవకాశం ఇచ్చాం.. పని తీరు సరిగ్గా లేని వారిని కొనసాగించామని పేర్కొన్నారు. ఇప్పుడు ఏం అనను.. రెన్యువల్ కోసం వస్తారు కదా అప్పుడు చెప్తానని తెలిపారు. పదవి వచ్చింది కదా అని కూర్చున్న వాళ్లకు కొనసాగింపు ఉండదు అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.
Read Also: Officer on Duty Trailer: మలయాళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు ట్రైలర్ విడుదల..
Also Read
ఇక, మార్చి 10వ తేదీ లోపు ఇంఛార్జ్ మంత్రులు జిల్లాకు వెళ్ళండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దేవాదాయ కమిటీలు, మార్కెట్ కమిటి డైరెక్టర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.. వాటికి సంబంధించిన జాబితా సిద్ధం చేయండి.. అందరికీ పదవులు ఇచ్చేద్దాం.. అలాగే, పదవులు వచ్చిన వాళ్ళు.. పదవి వచ్చింది నేను ఎందుకు పని చేయడం అనుకుంటున్నారు.. పదవి రాని వారు, పదవి రాలేదు కదా నేననేందుకు పని చేయడం అని అనుకుంటున్నారు.. మంచిని మైక్ లో చెప్పండి.. ఇక, పార్టీ నాయకులకు నా విజ్ఞప్తి.. ఏదైనా సమస్య అంటే చెవిలో చెప్పండి అన్నారు. గుజరాత్ మోడల్ సక్సెస్ మోడల్ కాదు.. ఆయన ప్రమోట్ చేసుకున్నారు.. టాక్స్ కలెక్షన్ లో తెలంగాణ నే టాప్.. ఆరో ప్లేస్ లో గుజరాత్ ఉంది.. విదేశీ పెట్టుబడులు తెచ్చింది తెలంగాణ.. వరి ధాన్యం పండించిన మొదటి రాష్ట్రం తెలంగాణ.. కాళేశ్వరం లేకుండానే కోటి 56 లక్షల టన్నులు పండించామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
Read Also: Himachal: రాష్ట్ర పథకాలకు “దేవాలయాల” డబ్బులు.. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ ఆగ్రహం..
అలాగే, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసే వరకు కసి తగ్గొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేము కష్ట పడుతున్నాం.. మీరంతా కష్ట పడాలన్నారు. అనుకూల వాతావరణం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడండి అని చెప్పుకొచ్చారు. ఇక, Slbc టన్నెల్ ఘటన జరిగిన గంటలోనే మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అందరు అక్కడికి వెళ్లారు.. రెస్య్కూ ఆపరేషన్ ను మంత్రులు దగ్గరుండి మరి పరిశీలించారు అని చెప్పారు. ఇక, కాస్మటిక్ చార్జీలు కేసీఆర్ పెంచలేదు.. మనం పెంచాము అని రేవంత్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
IPL Historic Day: బ్యాట్స్మెన్ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!
-
Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!