CM Revanth Reddy: పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది..
- పార్టీలో పడి పని చేస్తున్నవారికి గుర్తింపు ఉంటుంది..
- పార్టీ కోసం కష్టపడి పని చేసినవారి జాబితా ఇంఛార్జ్ సిద్ధం చేస్తారు..
- మార్చ్ 10వ తేదీలోపు పార్టీ శ్రేణులకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తాం: సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది అని తెలిపారు. పని చేసిన వారి జాబితాను కొత్త ఇంఛార్జ్ సిద్ధం చేస్తారు.. కొందరికి పదవులు రాలేదు.. మొదటి విడతలో కార్పొరేషన్ చైర్మన్లు రెండేళ్లు అవకాశం ఇచ్చాం.. పని తీరు సరిగ్గా లేని వారిని కొనసాగించామని పేర్కొన్నారు. ఇప్పుడు ఏం అనను.. రెన్యువల్ కోసం వస్తారు కదా అప్పుడు చెప్తానని తెలిపారు. పదవి వచ్చింది కదా అని కూర్చున్న వాళ్లకు కొనసాగింపు ఉండదు అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.
Read Also: Officer on Duty Trailer: మలయాళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు ట్రైలర్ విడుదల..
Also Read
ఇక, మార్చి 10వ తేదీ లోపు ఇంఛార్జ్ మంత్రులు జిల్లాకు వెళ్ళండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దేవాదాయ కమిటీలు, మార్కెట్ కమిటి డైరెక్టర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.. వాటికి సంబంధించిన జాబితా సిద్ధం చేయండి.. అందరికీ పదవులు ఇచ్చేద్దాం.. అలాగే, పదవులు వచ్చిన వాళ్ళు.. పదవి వచ్చింది నేను ఎందుకు పని చేయడం అనుకుంటున్నారు.. పదవి రాని వారు, పదవి రాలేదు కదా నేననేందుకు పని చేయడం అని అనుకుంటున్నారు.. మంచిని మైక్ లో చెప్పండి.. ఇక, పార్టీ నాయకులకు నా విజ్ఞప్తి.. ఏదైనా సమస్య అంటే చెవిలో చెప్పండి అన్నారు. గుజరాత్ మోడల్ సక్సెస్ మోడల్ కాదు.. ఆయన ప్రమోట్ చేసుకున్నారు.. టాక్స్ కలెక్షన్ లో తెలంగాణ నే టాప్.. ఆరో ప్లేస్ లో గుజరాత్ ఉంది.. విదేశీ పెట్టుబడులు తెచ్చింది తెలంగాణ.. వరి ధాన్యం పండించిన మొదటి రాష్ట్రం తెలంగాణ.. కాళేశ్వరం లేకుండానే కోటి 56 లక్షల టన్నులు పండించామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
Read Also: Himachal: రాష్ట్ర పథకాలకు “దేవాలయాల” డబ్బులు.. కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ ఆగ్రహం..
అలాగే, రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసే వరకు కసి తగ్గొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేము కష్ట పడుతున్నాం.. మీరంతా కష్ట పడాలన్నారు. అనుకూల వాతావరణం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడండి అని చెప్పుకొచ్చారు. ఇక, Slbc టన్నెల్ ఘటన జరిగిన గంటలోనే మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అందరు అక్కడికి వెళ్లారు.. రెస్య్కూ ఆపరేషన్ ను మంత్రులు దగ్గరుండి మరి పరిశీలించారు అని చెప్పారు. ఇక, కాస్మటిక్ చార్జీలు కేసీఆర్ పెంచలేదు.. మనం పెంచాము అని రేవంత్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!