KTR: అండగా ఉంటాం.. గ్రూప్-1 అభ్యర్థులకు కేటీఆర్ హామీ..
- గ్రూప్ 1 మెయిన్స్ ను వాయిదా వేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి..
- తప్పకుండా సహకరిస్తాం అని చెప్పిన కేటీఆర్..
- అభ్యర్థులు సుప్రీంకోర్టు కు వెళితే పార్టీ తరుపున అండగా ఉంటామని హామీ..
KTR: తెలంగాణ భవన్ లో గ్రూప్ 1 అభ్యర్థులతో కేటీఆర్ భేటీ ముగిసింది. గ్రూప్ 1 అభ్యర్థులు కేటీఆర్ తో కలవాలన్న అభ్యర్థన మేరకు ఇవాళ తెలంగాణ భవన్ ఆయన కలిసారు. జీవో నెంబర్ 29 ను ఎత్తివేయాలని కొందరు అభ్యర్థులు కేటీఆర్ ను కోరారు. ఈ జీవో వల్ల తమకు నష్టం జరుగుతుందని అభ్యర్థులు తెలిపారు. గ్రూప్ 1 మెయిన్స్ ను వాయిదా వేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని అభ్యర్థులు కేటీఆర్ కు తెలిపారు. దీనిపై స్పందించిన కేటీఆర్ తప్పకుండా సహకరిస్తాం అని చెప్పారు. అభ్యర్థులు సుప్రీంకోర్టు కు వెళితే పార్టీ తరుపున అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు.
Read also: Skin Care Tips: మెడ చుట్టూ నలుపు పోవాలంటే ఇలా చేయండి..
Also Read
గ్రూప్-1 మెయిన్స్ను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 21 నుంచి జరగనున్న గ్రూప్-1 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు దొర్లాయని, జీవో 29ని సవరించిన తర్వాతే మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై దాదాపు 33 కేసులు వచ్చాయని, వాటన్నింటినీ పరిష్కరించిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2011లో గ్రూప్-1 పరీక్షలు కూడా నిర్వహించామని, 2016లో రద్దు చేసి మళ్లీ నిర్వహించామని గుర్తు చేశారు.. మెయిన్స్ పరీక్షల్లో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్లో అన్ని ప్రశ్నలు తప్పులు లేకుండా ఉన్నాయని, 150 ప్రశ్నల్లో 20 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కేసులన్నింటినీ పరిష్కరించిన తర్వాతే మెయిన్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ టిక్కెట్ల దందా.. ఈడీ దర్యాప్తు ముమ్మరం..
- Tags
- group 1 mains
- ktr
- telangana
- TGPSC
- tspsc
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో