GHMC: నేడు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ.. మేయర్పై బీఆర్ఎస్ అవిశ్వాసం..?
- నేడు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం..
- మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి బీఆర్ఎస్ ప్లాన్?..
- కీలకంగా మారిన ఎంఐఎం పార్టీ మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC: ఈరోజు (జనవరి 23) జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అందులో హైదరాబాద్ నగరంలో చేపట్టాల్సిన పనులపై ప్రధానంగా చర్చించనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, రోడ్ల అభివృద్ధికి సిద్ధం చేసిన ప్లాన్ కి స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర వేయనుంది. అలాగే, కేబీఆర్ పార్క్ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచే అంశంపై కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Read Also: TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఏప్రిల్ కోటా టికెట్ల విడుదల
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
మరోవైపు, కారు పార్టీ నుంచి గెలిచిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలపై అవిశ్వాసం పెట్టడానికి బీఆర్ఎస్ సిద్దం అయింది. తాజాగా గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో అవిశ్వాసంపై చర్చకు వచ్చింది. కాగా, నాలుగేళ్ల వరకు అవిశ్వాసం ప్రవేశ్ పెట్టొద్దని ప్రభుత్వం చట్ట సవరణ తీసుకొచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ నాలుగేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 11వ తేదీన ముగుస్తుంది.. ఆ తర్వాత తీర్మానం చేసేందుకు బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. అయితే, జీహెచ్ఎంసీలోని 196 సభ్యులలో 50 శాతం మద్దతు కావాలి. ఈ తీర్మానానికి 98 మంది సభ్యుల సంతకాలు చేయాల్సి ఉంది. ఆ తరువాత ఈ తీర్మానాన్ని హైదరాబాద్ కలెక్టర్ కు ఇచ్చి.. ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసి ఆమోదించాల్సి ఉంటుంది.
Read Also: Rashmika Mandanna: రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్న.. రష్మిక కామెంట్స్ వైరల్ !
ఇక, ఈ అవిశ్వాస తీర్మానానికి ఆమోదం లభిస్తే మేయర్, డిప్యూటీ మేయర్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీలో మొత్తం 150 మందికి గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉండగా.. మరో50 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కౌన్సిల్లో196 మంది ఉన్నారు. అయితే, బీఆర్ఎస్కు 42 మంది కార్పొరేటర్లు, 11 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, 3 రాజ్యసభ ఎంపీలతో కలిపి మొత్తం 62 మంది సభ్యుల సంఖ్య బలం ఉండగా.. ఇటు కాంగ్రెస్ కు కొంత కాలంగా మజ్లిస్ పార్టీతో దోస్తీ పెరిగింది.
Read Also: California Fire: లాస్ ఏంజిల్స్లోని శాంటా క్లారిటాలో మంటలు.. ఇళ్లను వదిలిపెట్టిన 19 వేల మంది ప్రజలు
కాగా, బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఎంఐఎం సపోర్టు తమకే ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు అనుకుంటున్నారు. కానీ, మజ్లీస్ కాంగ్రెస్ తో జత కట్టిన విషయాన్ని అధికారికంగా నిరూపించడానికి ఈ తీర్మానం కలిసి వస్తుందని కారు పార్టీ యోచిస్తుంది. అయితే, మరోవైపు, బీజేపీ సైతం అవిశ్వాసానికి మద్దతిచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం గ్రేటర్ పాలక వర్గ సమయంతో పాటు ఇతర అంశాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో, హైదరాబాద్ మేయర్ పైన అవిశ్వాసం తీర్మానం ఇప్పడు పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తికరంగా మారింది.
- Tags
- bjp
- BRS
- congress
- GHMC
- Hyderabad Mayor
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!