Nalla Pochamma Bonalu: ప్రజాభవన్లో బోనాల సందడి.. నల్ల పోచమ్మ ఉత్సవాల్లో సీఎం రేవంత్రెడ్డి
- ప్రజాభవన్ లో ఘనంగా బోనాల ఉత్సవాలు..
- నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..
- బోనమెత్తిన మంత్రి కొండా సురేఖ- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalla Pochamma Bonalu: ఆషాడ మాసం సందర్భంగా ప్రజాభవన్లోని నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిసున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సతీమణి నందిని ప్రజాభవన్లో ఈరోజు నల్ల పోచమ్మ అమ్మవారికి నిర్వహించిన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి లు హాజరయ్యారు.
Read also: CM Revanth Reddy: నచ్చితే నచ్చిందని చెప్పండి లేకపోతే లేదు.. కాటమయ్య సేఫ్టీ కిట్లపై సీఎం ఆరా..
Also Read
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
- TG Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక ప్రకటన.. కారణం ఇదే..!
- CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
బోనాల ఉత్సవాల్లో భాగంగా.. ప్రజాభవన్కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులకు భట్టి విక్రమార్క దంపతులు పుష్ప గుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ పండితులు బోనాలకు, మహంకాళి అమ్మవారి ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, ఎమ్మెల్యే ఎన్.పద్మావతి ఉత్తమ్ , తదితర మహిళ ప్రజా ప్రతినిధులు బోనం ఎత్తుకోగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు మహంకాళి అమ్మవారి ఘటాన్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి జోగిని తలపై పెట్టారు. డిప్యూటీ సీఎం నివాసం నుంచి ప్రజాభవన్ ఆవరణలో ఉన్న నల్ల పోచమ్మ దేవాలయం వరకు డబ్బు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాల మధ్యన బోనాలను ఎత్తుకెళ్లారు. అనంతరం అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు బోనంలో ఉన్న నైవేద్యాన్ని సమర్పించారు.
Read also: CM Revanth Reddy: కల్లులో నీళ్ళు ఏమైనా పొస్తున్నారా..? సీఎం రేవంత్ ఫన్నీ కామెంట్స్
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు..
ప్రజా భవన్ లోని నల్ల పోచమ్మ దేవాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిణి రెడ్డి, తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి.. పాడి పంటలతో రాష్ట్రం విలసిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్, వీర్లపల్లి శంకర్, శ్రీహరి, గణేష్, కాలే యాదయ్య, మక్కాన్ సింగ్ ఠాగూర్, ఎన్ ఉత్తమ్ పద్మావతి, పర్ణిక రెడ్డి, మదన్మోహన్రావు, రామ్మోహన్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, విజయ రమణారావు, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.
Film News: ఒక్క క్లిక్ తో మూడు సినిమాలు..నొక్కి చూస్తే షాక్ అవుతారు..
తాజావార్తలు
-
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
-
Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. ‘జొనాథన్ డేవిడ్’ హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్పై 6-0 భారీ విజయం.!
-
Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
ట్రెండింగ్
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..