BJP K.Laxman: మూసీ నివాసితులకు భరోసాగా బీజేపీ ఉంటుంది..
- మూసీ నివాసితులకు భరోసాగా బీజేపీ ఉంటుంది- బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ ..
- మూసీ ప్రక్షాళన కు బీజేపీ వ్యతిరేకం కాదు..
- ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది.. ఇప్పుడు విజయోత్సవాలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP K.Laxman: మూసీ నివాసితులకు భరోసాగా బీజేపీ ఉంటుందని బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ అన్నారు. బీజేపీ మూసి నిద్రలో భాగంగా మలక్ పేట శాలివాహన నగర్ లో నిద్ర చేశారు. ఉదయం కార్యకర్తలతో కలిసి అల్పాహారం సేవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తం అవ్వాలన్నారు. కాదని పేదలతో చెలగాటం ఆడితే మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. మూసీ నివాసితుల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేస్తే.. బుల్డోజర్ లకు అడ్డం నిలబడుతామన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయన్నారు. మూసీ నివాసాలపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని హెచ్చరిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టర్ల జేబులు నింపే మార్గాలు అన్వేషిస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఈ మూసి ప్రక్షాళన అని తెలిపారు.
Read also: Rammurthy Naidu: నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడి పార్థివదేహం.. నివాళులర్పించిన నేతలు!
Also Read
మూసీ ప్రక్షాళన కు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మూసీ శుద్ధీకరణ చేయాలి.. పరిశుద్దంతో ప్రవహించి నల్గొండ, భాగ్యనగర్ ప్రజలకు ఉపశమనం కల్గించాలన్నారు. అందుకు అనేకమైన మార్గాలు ఉన్నప్పట్టికీ.. లక్షా యాభై వేల కోట్లతో మూసీ శుద్ధీకరణ అంటున్నారని తెలిపారు. వారసత్వంగా మూసీ నివాసితులు ఇక్కడ నివసిస్తున్నారని గుర్తుచేశారు. మూసీకి ఇరువైపులా గోడలు నిర్మించి.., ఎస్టీపీ లు ఏర్పాటు చేసి, డ్రైనేజీ వ్యవస్థను మార్చే అవకాశం ఉందన్నారు. కానీ పేదల ఇండ్లు బుల్డోజర్ల తో కూల్చి వేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు అహంకార పూరితంగా మాట్లాడడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. మీ ప్రతాపం పేదల మీదనా అని ప్రశ్నిస్తే.. బీజేపీ నీ కూడా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన గ్యారెంటీల విషయంలో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. అక్కడి మంత్రులే బాహాటంగా విమర్శిస్తున్నారని తెలిపారు.
Read also: Chain Snatchig: పటాన్ చెరులో చైన్ స్నాచింగ్ కలకలం.. తులసి చెట్టుకు పూజ చేస్తుండగా ఘటన..
కర్ణాటక దీన స్థితి చూసి.. హామీలు ఇచ్చి ముందు ఒకటికి రెండుసార్లు అలోంచాలని స్వయంగా ఖర్గేనే అంటున్నాడని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది.. ఇప్పుడు విజయోత్సవాలు చేస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికోసం ఈ విజయోత్సవాలు.. ఏం సాధించారని విజయోత్సవాలు చేస్తున్నారు. అని ప్రశ్నించారు. రైతులను నమ్మించి నట్టేట ముంచినందుకు విజయోత్సవాలు జరుపుతారా? అని మండిపడ్డారు. రైతులకు భరోసా పేరు పై 15 ఇస్తామన్నారు ఇవ్వలేదన్నారు. కౌలు రైతులకు, కూలీలకు వర్తింపజేస్తామన్నారన్నారు. కానీ ఒక్క రైతుకు కూడా భరోసా ఇవ్వలేకపోయారన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని మోది 6 వేల రూపాయలు ఇస్తున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోడు వింటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నారు. ఆరుగాలం కష్టపడి పండిస్తే నెలల తరబడి కొనుగోలు చేసే దిక్కు లేదన్నారు.
Maharashtra: బీజేపీ మాజీ మహిళా ఎంపీపై దాడి.. కుర్చీలు విసురుతూ.. దుర్భాషలాడుతూ(వీడియో)
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!