BJP K.Laxman: మూసీ నివాసితులకు భరోసాగా బీజేపీ ఉంటుంది..
- మూసీ నివాసితులకు భరోసాగా బీజేపీ ఉంటుంది- బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ ..
- మూసీ ప్రక్షాళన కు బీజేపీ వ్యతిరేకం కాదు..
- ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది.. ఇప్పుడు విజయోత్సవాలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP K.Laxman: మూసీ నివాసితులకు భరోసాగా బీజేపీ ఉంటుందని బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ అన్నారు. బీజేపీ మూసి నిద్రలో భాగంగా మలక్ పేట శాలివాహన నగర్ లో నిద్ర చేశారు. ఉదయం కార్యకర్తలతో కలిసి అల్పాహారం సేవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తం అవ్వాలన్నారు. కాదని పేదలతో చెలగాటం ఆడితే మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. మూసీ నివాసితుల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేస్తే.. బుల్డోజర్ లకు అడ్డం నిలబడుతామన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయన్నారు. మూసీ నివాసాలపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని హెచ్చరిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టర్ల జేబులు నింపే మార్గాలు అన్వేషిస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఈ మూసి ప్రక్షాళన అని తెలిపారు.
Read also: Rammurthy Naidu: నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడి పార్థివదేహం.. నివాళులర్పించిన నేతలు!
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
మూసీ ప్రక్షాళన కు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మూసీ శుద్ధీకరణ చేయాలి.. పరిశుద్దంతో ప్రవహించి నల్గొండ, భాగ్యనగర్ ప్రజలకు ఉపశమనం కల్గించాలన్నారు. అందుకు అనేకమైన మార్గాలు ఉన్నప్పట్టికీ.. లక్షా యాభై వేల కోట్లతో మూసీ శుద్ధీకరణ అంటున్నారని తెలిపారు. వారసత్వంగా మూసీ నివాసితులు ఇక్కడ నివసిస్తున్నారని గుర్తుచేశారు. మూసీకి ఇరువైపులా గోడలు నిర్మించి.., ఎస్టీపీ లు ఏర్పాటు చేసి, డ్రైనేజీ వ్యవస్థను మార్చే అవకాశం ఉందన్నారు. కానీ పేదల ఇండ్లు బుల్డోజర్ల తో కూల్చి వేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు అహంకార పూరితంగా మాట్లాడడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. మీ ప్రతాపం పేదల మీదనా అని ప్రశ్నిస్తే.. బీజేపీ నీ కూడా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన గ్యారెంటీల విషయంలో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. అక్కడి మంత్రులే బాహాటంగా విమర్శిస్తున్నారని తెలిపారు.
Read also: Chain Snatchig: పటాన్ చెరులో చైన్ స్నాచింగ్ కలకలం.. తులసి చెట్టుకు పూజ చేస్తుండగా ఘటన..
కర్ణాటక దీన స్థితి చూసి.. హామీలు ఇచ్చి ముందు ఒకటికి రెండుసార్లు అలోంచాలని స్వయంగా ఖర్గేనే అంటున్నాడని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది.. ఇప్పుడు విజయోత్సవాలు చేస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికోసం ఈ విజయోత్సవాలు.. ఏం సాధించారని విజయోత్సవాలు చేస్తున్నారు. అని ప్రశ్నించారు. రైతులను నమ్మించి నట్టేట ముంచినందుకు విజయోత్సవాలు జరుపుతారా? అని మండిపడ్డారు. రైతులకు భరోసా పేరు పై 15 ఇస్తామన్నారు ఇవ్వలేదన్నారు. కౌలు రైతులకు, కూలీలకు వర్తింపజేస్తామన్నారన్నారు. కానీ ఒక్క రైతుకు కూడా భరోసా ఇవ్వలేకపోయారన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని మోది 6 వేల రూపాయలు ఇస్తున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోడు వింటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నారు. ఆరుగాలం కష్టపడి పండిస్తే నెలల తరబడి కొనుగోలు చేసే దిక్కు లేదన్నారు.
Maharashtra: బీజేపీ మాజీ మహిళా ఎంపీపై దాడి.. కుర్చీలు విసురుతూ.. దుర్భాషలాడుతూ(వీడియో)
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?