Chain Snatchig: పటాన్ చెరులో చైన్ స్నాచింగ్ కలకలం.. తులసి చెట్టుకు పూజ చేస్తుండగా ఘటన..
- పటాన్ చెరు శాంతినగర్ లో చైన్ స్నాచింగ్..
- ఇంటి ముందు తులసి చెట్టుకు పూజ చేస్తుండగా ఘటన..
- సోమలక్ష్మి అనే మహిళ మెడలోంచి పుస్తెల తాడు లక్కెళ్లిన దుండగులు..
- ముఖం గుర్తుపట్టకుండా బైక్ పై ఇద్దరు ఒకరు మాస్క్, మరొకరు హెల్మెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chain Snatchig: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఓ మహిళ తెల్లవారు జామున తులసి చెట్టుకు పూజ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read
- CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
- Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
- Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
- CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని శాంతినగర్ కాలనీలో కార్తీక మాసం కావడంతో సోమలక్ష్మి అనే మహిళ ఉదయం లేచి ఇంటి ముందు తులసి చెట్టుకు పూజ చేస్తుంది. దీనిని గుమనించిన ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చారు. ఆ కాలనీలో ఎవరూ లేరని గ్రహించారు. ఒకరు బైక్ పై కూర్చొని వుండగా.. మరొకడు పూజ చేస్తున్న సోమలక్ష్మి వద్దకు వెళ్లి మెడలోంచి పుస్తెల తాడు లక్కొని పరుగులు పెట్టారు. సోమలక్ష్మి అరుపులకు కొందరు స్థానికులు అక్కడకు వచ్చారు. అయితే దుండగులు ఇద్దరు అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఇద్దరు దుండగులు ముఖం గుర్తుపట్టకుండా ఒకరు మాస్క్ వేసుకుని వుండగా, మరొకరు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడని స్థానికులు తెలిపారు. సోమలక్ష్మి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శాంతినగర్ కాలనీకి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. ఇద్దరు దుండగులు మాస్క్, హెల్మెట్ ధరించడంతో బైక్ నెంబర్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read also: Koti Deepotsavam 2024: కార్తీక ఆదివారం వేళ.. కోటి దీపోత్సవంలో 9వ రోజు కార్యక్రమాలు ఇవే!
మరోవైపు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పర్కెట్ లో దొంగల హల్చల్ సృస్టించారు. రాత్రి ఆసుపత్రికి వెళ్లి వచ్చేలోపే ఇల్లు గుల్ల చేశారు. తాళం పగలగొట్టి, ఇంట్లో చొరబడి 12 తులాల బంగారం, 30 తులాల వెండి, 50 వేల నగదు తీసుకుని ఉడాయించారు. బాధితులు పోలీసులకు సమాచారంతో ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mahavatar : మరో భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టిన హోంబలే ఫిల్మ్స్
తాజావార్తలు
-
Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
-
CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
-
Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
-
VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
-
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!