Chain Snatchig: పటాన్ చెరులో చైన్ స్నాచింగ్ కలకలం.. తులసి చెట్టుకు పూజ చేస్తుండగా ఘటన..
- పటాన్ చెరు శాంతినగర్ లో చైన్ స్నాచింగ్..
- ఇంటి ముందు తులసి చెట్టుకు పూజ చేస్తుండగా ఘటన..
- సోమలక్ష్మి అనే మహిళ మెడలోంచి పుస్తెల తాడు లక్కెళ్లిన దుండగులు..
- ముఖం గుర్తుపట్టకుండా బైక్ పై ఇద్దరు ఒకరు మాస్క్, మరొకరు హెల్మెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chain Snatchig: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఓ మహిళ తెల్లవారు జామున తులసి చెట్టుకు పూజ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
- Hyderabad Census : హైదరాబాద్లో ఇంటింటికీ సర్వే.. మీ ఇంటికీ వస్తున్నారు జాగ్రత్త..!
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని శాంతినగర్ కాలనీలో కార్తీక మాసం కావడంతో సోమలక్ష్మి అనే మహిళ ఉదయం లేచి ఇంటి ముందు తులసి చెట్టుకు పూజ చేస్తుంది. దీనిని గుమనించిన ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చారు. ఆ కాలనీలో ఎవరూ లేరని గ్రహించారు. ఒకరు బైక్ పై కూర్చొని వుండగా.. మరొకడు పూజ చేస్తున్న సోమలక్ష్మి వద్దకు వెళ్లి మెడలోంచి పుస్తెల తాడు లక్కొని పరుగులు పెట్టారు. సోమలక్ష్మి అరుపులకు కొందరు స్థానికులు అక్కడకు వచ్చారు. అయితే దుండగులు ఇద్దరు అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఇద్దరు దుండగులు ముఖం గుర్తుపట్టకుండా ఒకరు మాస్క్ వేసుకుని వుండగా, మరొకరు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడని స్థానికులు తెలిపారు. సోమలక్ష్మి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శాంతినగర్ కాలనీకి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. ఇద్దరు దుండగులు మాస్క్, హెల్మెట్ ధరించడంతో బైక్ నెంబర్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read also: Koti Deepotsavam 2024: కార్తీక ఆదివారం వేళ.. కోటి దీపోత్సవంలో 9వ రోజు కార్యక్రమాలు ఇవే!
మరోవైపు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పర్కెట్ లో దొంగల హల్చల్ సృస్టించారు. రాత్రి ఆసుపత్రికి వెళ్లి వచ్చేలోపే ఇల్లు గుల్ల చేశారు. తాళం పగలగొట్టి, ఇంట్లో చొరబడి 12 తులాల బంగారం, 30 తులాల వెండి, 50 వేల నగదు తీసుకుని ఉడాయించారు. బాధితులు పోలీసులకు సమాచారంతో ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mahavatar : మరో భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టిన హోంబలే ఫిల్మ్స్
తాజావార్తలు
-
NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
-
Hiro Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
-
Axar Patel: విజయం సాధించిన లేని ఆనందం.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్కు భారీ జరిమానా..!
-
KTR: “23 లక్షల మందికి మానసిక క్షోభ”.. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
-
Dragon :‘డ్రాగన్’ గ్లింప్స్ టైమ్ ఫిక్స్ ..?
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!