Etela Rajender: ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో పాల్గొనండి.. మూసీ బాధితులకు ఈటెల పిలుపు..
- ఈనెల 25న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా..
- పాల్గొనాలని మూసీ బాధిత కుటుంబాలకు ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: ఈనెల 25న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు మూసీ బాధిత కుటుంబాలు తరలిరావాలని ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. ఉప్పల్ నియోజక వర్గంలోని మూసి పరివాహక ప్రాంతం అయిన రామంతపూర్ లోని కేసీఆర్ నగర్, బాలకృష్ణ నగర్, సాయికృష్ణ నగర్ ప్రాంతాల ఈటెల రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు కేసీఆర్ పై విసిగిపోయి, కాంగ్రెస్ ఆశ చూపే హామీలు విని కాంగ్రెస్ ని పట్టం కట్టి గెలిపించారని తెలిపారు. కాంగ్రెస్ ని గెలిపించిన పాపానికి గత రెండు మూడు నెలలుగా చెరువుల వద్ద, మూసి పరివాహక ప్రాంతం వద్ద గత ముప్పై ఎండ్లకు పైగా ఇంటి నిర్మాణాలు చేపట్టి నివసిస్తున్న కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు. శనివారం, ఆదివారం వస్తే చాలు ఈ ప్రాంత ప్రజలు నిద్రలేకుండా భయబ్రాంతులకు గురిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు.
Read also: Bandi Sanjay: జాలేస్తోంది..? కేటీఆర్ లీగల్ నోటీసుపై బండి సంజయ్ స్పందన..
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
ఈ ప్రాంత ప్రజల శవాల మీద నడుచుకుంటూ వెళ్లి ఇమాక్స్ లాంటి నిర్మాణాలు చేపట్టుకోవాల్సి వస్తుంది కానీ మా గొంతులో ప్రాణం ఉండగా ఇక్కడి ఇండ్లను కూల్చనీయము ఇక్కడి ప్రజలు చెప్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామాన్య ప్రజానీకం పైన దౌర్జన్యం కొనసాగిస్తున్నారని అన్నారు. బీజేపీ పార్టీ ఈ పేదలకు అండగా ఉంటుంది… ఇండ్లను కులగొట్టలనీ ప్రయత్నిస్తే కబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ పరంగా నేడు, రేపు మూసి పరివాహక ప్రాంతం ప్రజలను ఇండ్లను సందర్శించి, వారి మాటలను ప్రతిబింబించే విధంగా 25న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తామన్నారు. మాకోసం చేస్తున్న ధర్నాకు వంద శాతం హాజరు అవుతాము అని ఇక్కడి ప్రజలు చెప్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, కానీ సుందరీకరణ పేరుతో కూల్చే ప్రయత్నం చేయొద్దు అన్నారు. ఆనాడు నిజాం ప్రభుత్వం చేపట్టిన పనులు చేపట్టి, మూసి సుందరీకరణ చేపట్టాలన్నారు ఈటెల. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, మూసి పరివాహక ప్రాంతం బాధితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Sangareddy Crime: నా భర్త చివరి కోరిక మేరకే అంత్యక్రియలు ఆపాను: మృతుడి భార్య..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!