Balapur Ganesh Laddu: అందరి చూపు బాలాపూర్ లడ్డూ వేలం పైనే.. ఈసారి రూ.30 లక్షలు పైమాటే..?
- గత 30 ఏళ్లుగా జరుగుతున్న ఈ లడ్డూ వేలం ఏటా రికార్డులు బద్దలు కొడుతోంది..
- వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ఎంత అన్నది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్..
- ఈసారి రూ.30 లక్షలకు పైనే పలుకుతుందని టాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balapur Ganesh Laddu: దేశమంతటా మండపాలలో కొలువుదీరిన బొజ్జ గణపయ్యలు గంగమ్మ ఒడిలో చేరేందుకు ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి భాగ్యనగరంలోని బాలాపూర్ లడ్డూ వేలంపైనే ఉంది. ప్రతి సంవత్సరం వేలంలో రికార్డు ధర పలుకుతోంది. అందుకే భక్తుల గుండెల్లో బంగారంగా నిలిచిన గణనాథుడి లడ్డూ వెలమ పాట కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఊరేగింపు అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద లడ్డూ వేలంపాట మొదలు పెట్టనున్నారు. గతేడాది 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూలు ఈసారి ఎంత ధర పలుకుతాయోనని ఉత్కంఠ నెలకొంది. వినాయక విగ్రహాల ఎత్తులోనే కాదు.. ఆయన చేతిలో పెట్టే లడ్డూల సైజుల్లోనూ పోటీ పెరిగింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి బాలవూరు గణేశుడి విగ్రహం కంటే బాలాపూర్ గణేశుడి చేతిలోని లడ్డూపై పడింది. ఈ ఏడాది వేలం పాటలో లడ్డూ బద్దలు కొడుతుందేమోనని అందరూ ఎదురు చూస్తున్నారు.
Read also: September 17: ఇటు కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవం.. అటు బీజేపీ విమోచన దినోత్సవం..
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
గత 30 ఏళ్లుగా జరుగుతున్న ఈ లడ్డూ వేలం ఏటా రికార్డులు బద్దలు కొడుతోంది. అందుకే ప్రతి వినాయక చవితి.. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ఎంత అన్నది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. బాలాపూర్ లడ్డూను కొనుగోలు చేసేందుకు పలువురు వేలంలో పాల్గొంటారు. లక్షలు చెల్లించినా బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతేడాది వేలం మొత్తం జమ చేయాలి. అంటే 27 లక్షల ధరకు కొనుగోలు చేసిన వారి పేరు బాలాపూర్ లడ్డూ వేలంలో ఉంటుందన్నమాట. అయితే ఇంతకుముందు ఈ నిబంధన స్థానికేతరులకు మాత్రమే ఉండేది. ఈసారి స్థానికులకు కూడా అదే నిబంధన వర్తింపజేశారు. గ్రామస్తుల నుంచి కూడా తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో ఈ నిబంధన తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గతేడాది లడ్డూ కోసం రూ.27 లక్షలు డిపాజిట్ చేసిన వారికే లడ్డూ వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈసారి రూ.30 లక్షలకు పైనే పలుకుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
Khairatabad Ganesh: మొదలైన ఖైరతాబాద్ సప్తముఖ గణపతి శోభాయాత్ర..
తాజావార్తలు
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!