September 17: ఇటు కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవం.. అటు బీజేపీ విమోచన దినోత్సవం..
- ఇటు ప్రజాపాలన దినోత్సవం-అటు విమోచన దినోత్సవం..
- పబ్లిక్ గార్డెన్స్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
- పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు..
- కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి- బండి సంజయ్ పాల్గొంటారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
September 17: సెప్టెంబర్ 17న దేశంలో హైదరాబాద్ రాష్ట్ర విలీన వేడుకలను పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంగళవారం అధికారికంగా నిర్వహిస్తున్నారు. అయితే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ తమ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 9.30 కి జూబ్లీహిల్స్ నివాసం నుండి సీఎం రేవంత్ పబ్లిక్ గార్డెన్స్ బయలుదేరనున్నారు. గన్ పార్క్ లో అమర వీరుల స్థూపం దగ్గర నివాళి అర్పించనున్న సీఎఎం . అనంతరం ఉదయం 10 గంటలకు పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండా ఎగరేయనున్నారు సీఎం. ఈ కార్యక్రమానికి జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
Read also: Kolkata Doctor Case: వైద్యుల డిమాండ్లకు తలొగ్గిన మమతా బెనర్జీ.. కోల్కతా టాప్ కాప్ తొలగింపు..
Also Read
తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ జరుపుకోవాలని నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనుండగా, మిగిలిన జిల్లాల్లో త్రివర్ణ పతాకాలు ఎగురవేసే వారి వివరాలను పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. . అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో మూడేండ్ల జెండాను ఎగురవేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read also: Khairatabad Ganesh: మొదలైన ఖైరతాబాద్ సప్తముఖ గణపతి శోభాయాత్ర..
మరోవైపు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొంటారు. ఉదయం 7.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ‘సెప్టెంబర్ 17 – హైదరాబాద్ విమోచన దినోత్సవం’ ప్రాముఖ్యతను వివరిస్తూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారిచే చిన్న ప్రదర్శన ఉంటుంది.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని.. గత ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటోంది. ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొనాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆహ్వానించింది. సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే కార్యక్రమానికి వెళ్తాను’ అని బండి వెల్లడించారు.
Khairatabad Ganesh: నేడు గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేష్..
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!