CM Chandrababu: ముగిసిన దుబాయ్ పర్యటన.. హైదరాబాద్ చేరుకున్న సీఎం చంద్రబాబు
- దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీబీఎన్..
- పెట్టుబడులే లక్ష్యంగా మూడు రోజుల పాటు దుబాయ్లో ఏపీ సీఎం పర్యటన..
- ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో.. 25 కీలక సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెట్టుబడులే లక్ష్యంగా మూడు రోజుల పాటు దుబాయ్లో పర్యటించారు ఏపీ సీఎం.. ఈ పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో.. 25 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు.. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులతోనూ సమావేశమయ్యారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ఉన్న వనరులు.. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు.. ఇలా అన్ని వివరించారు సీఎం చంద్రబాబు.. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న CII ఇన్వెస్టర్స్ మీట్లో పాల్గొనేందుకు రావాల్సిందిగా అందరినీ ఆహ్వానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Gujarat Honour Killing: తల్లి, తోడబుట్టిన అన్న కలిసి.. కుమార్తెను ఏం చేశారో తెలుసా..
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
దుబాయ్లో తెలుగు ప్రజలతో నిర్వహించిన డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కీలక వ్యాఖ్యలు చేవారు.. గల్ఫ్లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 30 ఏళ్లుగా దుబాయ్ వస్తున్నా కానీ, ఈ సారి దుబాయ్ లో తెలుగు ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.. మొన్న ఎన్నికల్లో కూటమి గెలవాలని, సొంత డబ్బులతో రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేసి, కూటమికి ఘన విజయం అందించారు. మీరు మా పైన చూపించిన నమ్మకాన్ని జీవితంలో మర్చిపోలేను అన్నారు చంద్రబాబు.. గల్ఫ్ లో ఉన్న తెలుగు వారు మొత్తం ఇక్కడే ఉన్నట్టు ఉంది.. నాడు మిమ్మల్ని గ్లోబల్ సిటిజెన్స్ గా ఉండాలని కోరుకున్నా.. మీరు గ్లోబల్ లీడర్స్ గా మారుతున్నారు అంటే, సంతోషంగా ఉందన్నారు.. గతంలో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు విశాఖకు గూగుల్.. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..