CM Chandrababu: ముగిసిన దుబాయ్ పర్యటన.. హైదరాబాద్ చేరుకున్న సీఎం చంద్రబాబు
- దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీబీఎన్..
- పెట్టుబడులే లక్ష్యంగా మూడు రోజుల పాటు దుబాయ్లో ఏపీ సీఎం పర్యటన..
- ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో.. 25 కీలక సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెట్టుబడులే లక్ష్యంగా మూడు రోజుల పాటు దుబాయ్లో పర్యటించారు ఏపీ సీఎం.. ఈ పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో.. 25 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు.. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులతోనూ సమావేశమయ్యారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ఉన్న వనరులు.. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు.. ఇలా అన్ని వివరించారు సీఎం చంద్రబాబు.. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న CII ఇన్వెస్టర్స్ మీట్లో పాల్గొనేందుకు రావాల్సిందిగా అందరినీ ఆహ్వానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Gujarat Honour Killing: తల్లి, తోడబుట్టిన అన్న కలిసి.. కుమార్తెను ఏం చేశారో తెలుసా..
Also Read
- Srisailam Dam: శ్రీశైలం వైపు దూసుకొస్తున్న కృష్ణమ్మ.. వారంలో గేట్లు ఎత్తే అవకాశం.!
- Telangana Rains: గోదావరి ఉగ్రరూపం.. ములుగు జలదిగ్బంధం, జూరాల గేట్లు ఎత్తివేత.!
- CM Revanth Reddy : యువతకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!
- Rega Kantha Rao: "పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు".. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
దుబాయ్లో తెలుగు ప్రజలతో నిర్వహించిన డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కీలక వ్యాఖ్యలు చేవారు.. గల్ఫ్లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 30 ఏళ్లుగా దుబాయ్ వస్తున్నా కానీ, ఈ సారి దుబాయ్ లో తెలుగు ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.. మొన్న ఎన్నికల్లో కూటమి గెలవాలని, సొంత డబ్బులతో రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేసి, కూటమికి ఘన విజయం అందించారు. మీరు మా పైన చూపించిన నమ్మకాన్ని జీవితంలో మర్చిపోలేను అన్నారు చంద్రబాబు.. గల్ఫ్ లో ఉన్న తెలుగు వారు మొత్తం ఇక్కడే ఉన్నట్టు ఉంది.. నాడు మిమ్మల్ని గ్లోబల్ సిటిజెన్స్ గా ఉండాలని కోరుకున్నా.. మీరు గ్లోబల్ లీడర్స్ గా మారుతున్నారు అంటే, సంతోషంగా ఉందన్నారు.. గతంలో హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు విశాఖకు గూగుల్.. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Ramayana : సీతగా సాయి పల్లవి కన్నా అందంగా శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్.. అసలు నిజం ఇదా?
-
Central Cabinet Decision: సముద్ర మంథన్ ప్రాజెక్ట్ ఆమోదం.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
Ramayana: ఊపిరి పీల్చుకున్న రామాయణ టీమ్?
-
Srisailam Dam: శ్రీశైలం వైపు దూసుకొస్తున్న కృష్ణమ్మ.. వారంలో గేట్లు ఎత్తే అవకాశం.!
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!