Pending Challans: ట్రాఫిక్ చలాన్లపై భారీ రాయితీ.. రేపటి నుంచి ఇలా చెల్లించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘించి భారీ ఎత్తున ట్రాఫిన్ చలాన్లు పడిన వారికి గుడ్న్యూస్ చెప్పారు ట్రాఫిక్ పోలీసులు.. పేరుకుపోయిన ఈ-చలాన్లు క్లియర్స్ కోసం భారీ రాయితీలు ప్రకటించారు.. ద్విచక్ర వాహనదారులు, ఆటోవాలాలు పెండింగ్లో ఉన్న జరిమానాల్లో 25 శాతం చెల్లించి, 75 శాతం రాయితీ పొందవచ్చు. తోపుడు బండ్లపై ఉన్న చలాన్ల మొత్తంలో 20 శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 80 శాతం రాయితీ. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు 30 శాతం చెల్లించవచ్చు. మిగతా 70 శాతం రాయితీ ఇస్తారు. కార్లు, తదితర వాహనదారులు 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ చలాన్లు ఎలా చెల్లించాలని అనే దానిపై క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆన్ లైన్ ద్వారానే పెండింగ్ చనాన్లు చెల్లించాలని సూచించారు.
Read Also: YS Viveka Case: లోక్సభ స్పీకర్కు సునీతారెడ్డి లేఖ.. హత్యలో అవినాష్రెడ్డి హస్తం..!
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
ఈ చలాన్ సిస్టమ్ ద్వారా అన్ని పెండింగ్ చలాన్లు చెల్లించాలని సూచించారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్… ఆన్లైన్లో అంటే ఫోన్ పే, పేటీఏం, గూగుల్ పే వంటి సేవలు ఉపయోగించుకోవచ్చన్న ఆయన.. లేదా మీ సేవ, ఈ సేవలో కూడా చెల్లించే అవకాశం ఉందన్నారు.. రేపటి నుంచి (మార్చి 1వ తేదీ) మార్చి 30వ తేదీ వరుకు ట్రాఫిక్ చలాన్లపై రాయితీ అమలు అవుతుందన్నారు. కరోనా కారణంగా అందరూ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు.. అందుకే ఈ రాయితీ కల్పించామన్నారు. ద్విచక్ర వాహనలకి 25 శాతం రాయితీ కల్పించాం.. నో మాస్క్ చలాన్లు కూడా రూ.1000 ఉంటే రూ.100 కడితే చాలన్నారు.. పేద వర్గాలకు వెసులబాటు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. కేవలం హైదరాబాద్లోనే 500 కోట్ల రూపాయల విలువైన 1.75 లక్షల చలాన్లు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. చెల్లింపులు అన్నీ ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు అని తెలిపారు రంగనాథ్.. తెలంగాణ ఈ చలాన్ వెబ్ సైట్లో ప్రాసెస్ చేస్తుందని.. నెల రోజుల వేసులబాటులో చలాన్లు కట్టకపోతే తగిన చర్యలు తీసుకుంటామని.. దానికోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్టు తెలిపారు. మరోవైపు, ఆటోలపై నిబంధనలు విధించామని తెలిపారు జాయింట్ సీపీ రంగనాథ్.. హైదరాబాద్ సిటీలో పర్మీషన్ ఉన్నవి ఉంటే పరవాలేదు.. కానీ, బయట జిల్లాల నుంచి వచ్చే వాటిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆటోలో మీటర్ వేసే పరిస్థితి లేదని.. స్పెషల్ డ్రైవ్పై ఆటో యూనియన్లకు సమాచారం కూడా ఇచ్చినట్టు తెలిపారు.
తాజావార్తలు
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..