Shirdi Tour: షిర్డీ వెళ్లే యాత్రికులకు తెలంగాణ సర్కార్ అదిరే ఆఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shirdi Tour: షిర్డీ వెళ్లే యాత్రికులకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ శుభవార్త అందించింది. షిర్డీ వెళ్లాలనుకునే భక్తుల కోసం తెలంగాణ టూరిజం శాఖ రెండు ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి షిర్డీకి తక్కువ ధరకే ప్యాకేజీలు ప్రకటించింది. రెండు రాత్రులు, ఒక పగలు సాగే ఈ పర్యటనను ఏసీ, నాన్ ఏసీ ప్యాకేజీలుగా అధికారులు విభజించారు. ఏసీ బస్సులో ప్రయాణానికి టికెట్ ధరలు పెద్దలకు రూ.3,700, పిల్లలకు రూ.3,010గా నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సులో ప్రయాణించేందుకు పెద్దలకు రూ.2,400, పిల్లలకు రూ.1,970 టికెట్ ధరలు నిర్ణయించారు. ప్రతిరోజూ సాయంత్రం హైదరాబాద్లోని ఎంపిక చేసిన పికప్ పాయింట్ల నుండి బస్సులు బయలుదేరుతాయి. బషీర్బాగ్, ప్యారడైజ్, బేగంపేట్, కేపీహెచ్బీ, దిల్షుక్నగర్, మియాపూర్ పికప్ పాయింట్ల నుంచి సాయంత్రం బస్సులు షిర్డీకి బయలుదేరుతాయని టీఎస్టీడీసీ అధికారులు వెల్లడించారు.
Read also: Beer Powder : కేసులు కేసులు కాదు.. ప్యాకెట్లు ప్యాకెట్లు బీరు కొట్టేయొచ్చు
Also Read
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
- Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
- Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
బస్సులు హోటళ్లలో ఉదయం 7 గంటలకు షిర్డీకి చేరుకుంటాయి. ప్రయాణికులు సిద్ధమైన తర్వాత బస్సులు దర్శనానికి బయలుదేరుతాయి. ప్రధాన దర్శనం తర్వాత, సమీపంలోని మరికొన్ని ఆలయాలను కూడా సందర్శించవచ్చు. బస్సు షిర్డీ నుండి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఆలయ అధికారిక వెబ్సైట్లో దర్శన టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో షిర్డీ సాయినాథుని దర్శనం టిక్కెట్ సౌకర్యం చేర్చబడలేదు. బాబా దర్శనం కోసం భక్తులు ముందుగానే టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవాలి. అలాగే మధ్యాహ్న భోజన ఏర్పాట్ల కోసం భక్తులు తమ సొంత ఖర్చులు భరించాల్సి ఉంటుంది. టూర్కు సంబంధించిన మరిన్ని వివరాలకు https://tourism.telangana.gov.in/package/ShirdiTour వెబ్సైట్ను సందర్శించాలని భక్తులకు అధికారులు సూచించారు. షిర్డీ వెళ్లాలనుకునే భక్తులకు ఇది బెస్ట్ ఆఫర్ అని టీఎస్టీడీసీ అధికారులు వెల్లడించారు.
RTC Kalabhavan: ఆర్టీసీ కళా భవన్ సీజ్.. అద్దె కట్టకపోవటం వల్లే..!
తాజావార్తలు
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
ట్రెండింగ్
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!