Hyderabad Police: ABVP నాయకురాలిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Police: జీవో నెం.55కి వ్యతిరేకంగా హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. విద్యార్థులకు మద్దతుగా.. నిన్న ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ అక్కడి నుంచి పరుగు తీశారు. అయితే ఝాన్సీని పట్టుకునేందుకు ఇద్దరు మహిళా పోలీసులు స్కూటీపై వెంబడించారు. తన దగ్గరకు రాగానే.. వెనుక ఉన్న పోలీసు తనను అడ్డుకునే ప్రయత్నంలో ఝాన్సీ జుట్టును పట్టుకున్నారు. అయితే.. స్కూటీ నడుస్తుండగా ఝాన్సీ కిందపడిపోయింది. అయినా కూడా ఝాన్సీని వదలకుండా అలాగే జుట్టును గట్టిగా పట్టుకునే వున్నారు. అయితే వెంటనే బండిని ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. స్కూటీని ఆపి ఆమెను అలాగే పట్టుకుని ఉన్నారు. ఝాన్సీ లేచి పోలీసులపై సీరియస్ అయ్యారు.
Read also: Direct Listing : GIFT IFSCలో అంతర్జాతీయ ఎక్స్ఛేంజీలలో భారతీయ కంపెనీల ప్రత్యక్ష జాబితాకు ఆమోదం
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఇలాగేనా మహిళల పట్ల పోలీసులు వ్యవహరించడం అంటూ ఫైర్ అయ్యారు. అవును ఇలాగే ఉంటుంది మరి అంటూ పోలీసులు సమాధానం ఇచ్చారు. అయితే ఈ ఘటనలో విద్యార్థి నాయకుడికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో… ఈ ఘటన ఇప్పుడు వివాదాస్పదమైంది. ఓ విద్యార్థి నాయకురాలిపై ఇంత దారుణంగా ప్రవర్తించడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాస్త కూడా కనికరం లేకుండా జుట్టు పీక్కుని ఈడ్చుకుని వెళ్లడం ఏంటని మండిపడుతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే ప్రజలపట్ల కటువుగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఈ భూములను హైకోర్టుకు తీసుకురావద్దని డిమాండ్ చేస్తున్నారు. జీవో నెం.55 ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Maldives-India: భారత్ కు మద్దతుగా నిలిచిన మాల్దీవుల ప్రతిపక్ష పార్టీలు
తాజావార్తలు
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!