భూమిని కబ్జా చేయలేదు, దేనికైనా సిద్దమే: ఉప్పల్ ఎమ్మెల్యే క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భూవివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై నిన్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుపై ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాప్రా భూ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. అప్పట్లో ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారని తనకు ఎమ్మార్వో చెబితే ఆ విషయంపై పోలీసు అధికారితో మాట్లాడాతానని ఆయన వెల్లడించారు. తాను ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా అడ్డుకున్న కానీ..తనకు ఎటువంటి దుర్బుద్ధి లేదన్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా అడ్డుకునే బాధ్యత ఎమ్మెల్యేగా తనపై ఉందని..తాను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపిస్తే.. తాను దేనికి అయిన సిద్ధమే అని పేర్కొన్నారు. తాను కూడా కోర్టుకు వెళ్తానని…తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై
పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
Also Read
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!