Bhatti Vikramarka : విద్యుత్ శాఖలో చలనం.. కేబుళ్ల తొలగింపుపై డిప్యూటీ సీఎం ఆదేశాలు
- విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
- కేబుల్ వైర్లు యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించిన భట్టి
- అనుమతి లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు
- ఏడాది సమయం ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదు
- ప్రజల ప్రాణాలతో చెలగాటం సరైంది కాదు. -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : హైదరాబాద్ మహానగరంలో పండగ వేళ విషాదం వరుసగా దాడి చేస్తోంది. గత రెండు రోజుల్లోనే కరెంట్ షాక్ల కారణంగా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆదివారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామంతాపూర్ గోఖుల్నగర్లో నిర్వహించిన రథోత్సవం సమయంలో విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడగా, వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది.
మంగళవారం చాంద్రాయణగుట్ట బండ్లగూడలో మరో విషాదం చోటు చేసుకుంది. 22 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని తరలించే సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు యువకులు—ధోని (21), వికాస్ (20) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు అంబర్పేటలో కూడా ప్రమాదం జరిగింది. వినాయక మండపానికి పందిరి కడుతున్న సమయంలో కరెంట్ వైర్లు తగలడంతో రామ్ చరణ్ అనే వ్యక్తి షాక్కు గురయ్యాడు. అతడి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read
- Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
- Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
- Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
Mumbai Monorail Breaks Down: ముంబైలో రెండు ముక్కలైన మోనోరైలు.. ఇరుక్కుపోయిన 100 మంది!
ఈ వరుస ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రామంతాపూర్, బండ్లగూడ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల తర్వాత వారు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వర్షాల సమయంలో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుళ్లను తొలగించే పనులు ప్రారంభించారు. ఉప్పల్, రామంతాపూర్, చిలకానగర్లలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ స్తంభాలపై వేలాడుతున్న కేబుళ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. అనుమతి లేకుండా కనెక్షన్లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడటం సహించబోమని భట్టి స్పష్టం చేశారు.
JR NTR : ఎన్టీఆర్ కు జరిగిందే మీకూ జరగొచ్చు.. సింగర్ మద్దతు..
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!